Fact Check: ఎన్నికల నేపథ్యములో గల్ఫ్ దేశాల నుండి వస్తున్న ఫ్లైట్స్ యొక్క నకిలీ వార్తాపత్రిక కట్టింగ్స్ వైరల్ అవుతున్నాయి

విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ క్లెయిమ్ నకిలీది అని కనుగొనింది. అంతేకాకుండా, మొదటి దశలో పశ్చిమ యూపిలో వోటింగ్ సీట్స్ గురించిన సమాచారము కూడా తప్పు. ఈ తప్పు సమాచారము లక్నౌకు తప్పుగా ఆపాదించబడిన టైంలైన్ తో 2022లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయములో కూడా వైరల్ అయ్యింది.

Fact Check: ఎన్నికల నేపథ్యములో గల్ఫ్ దేశాల నుండి వస్తున్న ఫ్లైట్స్ యొక్క నకిలీ వార్తాపత్రిక కట్టింగ్స్ వైరల్ అవుతున్నాయి

కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్ – లోక్ సభ ఎన్నికలు 2024 జరుగబోతున్న తరుణములో, ఒక వార్తాపత్రిక కట్టింగ్ సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ముస్లింగ్ సమాజములో వోటింగ్ కొరకు అత్యుత్సాహము కనిపిస్తోందని, దాని వలన గల్ఫ్ దేశాల నుండి ఫ్లైట్స్ పెరిగాయని తెలియజేయబడింది. కొంతమంది యూజర్లు దీనికి మతపరమైన రంగును అద్దుతూ ఈ సమాచారాన్ని షేర్ చేస్తున్నారు.

విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ క్లెయిమ్ నకిలీది అని కనుగొనింది. అంతేకాకుండా, మొదటి దశలో పశ్చిమ యూపిలో వోటింగ్ సీట్స్ గురించిన సమాచారము కూడా తప్పు. ఈ తప్పు సమాచారము లక్నౌకు తప్పుగా ఆపాదించబడిన టైంలైన్ తో 2022లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయములో కూడా వైరల్ అయ్యింది.

ఏది వైరల్ అవుతోంది?

కొంతమంది యూజర్లు ఈ కట్టింగ్ ను విశ్వాస్ న్యూస్ యొక్క టిప్ లైన్ నంబర్ +91 9599299372 కు ఫార్వర్డ్ చేసి, దీని ప్రామాణికతపై స్పష్టతను కోరారు. దీని క్లెయిమ్ ఈ విధంగా ఉంది, “వోటు వేసేందుకు ముస్లిం కమ్యూనిటీలో అత్యుత్సాహం కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల నుండి వచ్చే అన్ని ఫ్లైట్స్ నిండుగా ఉన్నాయి.”

దర్యాప్తు:

వైరల్ క్లెయిమ్ ను ధృవీకరించుటకు మేము వార్తాపత్రిక కట్టింగ్  గురించి విచారించాము మరియు అందులో కొన్ని తప్పులను గమనించాము.  

జైపూర్ డేట్‎లైన్ లో అందించబడిన సమాచారము ప్రకారము వోటింగ్ యొక్క మొదటి దశ ఏప్రిల్ 19 నాడు షెడ్యూల్ చేయబడింది. అదనంగా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోని 58 సీట్ల కొరకు ఎన్నికలు నిర్వహించబడుటకు ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇందులో మొదటి దశ వోటింగ్ ఊహించి ప్రచారము నిషేధించబడింది అని కూడా పేర్కొనబడింది.

వైరల్ పోస్ట్ ఏప్రిల్ 16, 2024 తేదీ నాటిది, కాగా మొదటి దశ కొరకు ఎన్నికల ప్రచారము ఏప్రిల్ 17, 2024 నాడు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దైనిక్ జాగరణ్, యొక్క వెబ్సైట్ పై ప్రచురించబడిన వార్తల ప్రకారము, రాజకీయ పార్టీల అభ్యర్ధులు ఏప్రిల్ 17, 2024 సాయంత్ర్ 6 గంటల వరకు ప్రచారము చేసుకోవచ్చు. అంటే వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని ఇది సూచిస్తుంది.

లోక్ సభ ఎన్నికలు 2024 యొక్క మొదటి దశలో, ఉత్తర్ ప్రదేశ్ యొక్క ఎనిమిది సీట్ల కొరకు వోటింగ్ నిర్వహించబడుతుంది అని దైనిక్ జాగరణ్ లో ప్రచురించబడిన వార్త పేర్కొనింది. అవి కైరానా, ముజఫర్ నగర్, సహరాన్‎పూర్, బిజ్నోర్, పిలిభిత్, రాంపూర్, మొరాదాబాద్ మరియు నగీన. మొదటి దశలో రాష్ట్రములోని కేవలం ఎనిమిది సీట్లలో వోట్ల కొరకు షెడ్యూల్ చేయబడితే, మొఅటి దశలో పశ్చిమ యూపిలో 58 సీట్ల కొరకు వోటింగ్ కు సంబంధించిన సమాచారము కూడా సరైనది కాదు.

ఆర్కైవ్ చేయబడిన విధంగా, ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే దశల-వారి ఎన్నికల గురించిన సమాచారము ఎన్నికల కమిషన్ యొక్క అధికారిక  X హ్యాండిల్ నుండి మార్చ్ 31, 2024 నాడు పోస్ట్ చేయబడింది. పోస్ట్ ప్రకారము, మొదటి దశ్డలో రాష్ట్రములోని ఎనిమిది సీట్ల కొరకు ఎన్నికలు షెడ్యూల్ చేయబడ్డాయి.

దీనిని అనుసరించి, మేము సంబంధించిన కీవర్డ్స్ ఉపయోగించి ఒక గూగుల్ సెర్చ్ నిర్వహించాము, కాని వైరల్ క్లెయిమ్ ను ధృవీకరించే మీడియా నివేదిక ఏది మాకు లభించలేదు.

మా సెర్చ్ సమయములో, ఇటువంటి పోస్ట్ లు 2022లో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయములో కూడా వైరల్ అయ్యాయి అని మేము కనుగొన్నాము. ఫిబ్రవరి 10, 2022 నాడు ఫేస్‎బుక్ యూజర్ అమిత్ సింగ్ కూడా ఇటువంటి పోస్ట్ ను షేర్ చేశారు (ఆర్కైవ్ లింక్).

ఫిబ్రవరి 2022 నాడు షేర్ చేయబడిన పోస్ట్ లో డేట్ లైన్ లక్నౌ అని మరియు మొదటి దశ వోటింగ్ ఫిబ్రవరి 10, 2022 అని పేర్కొనబడింది. పాత మరియు కొత్త పోస్ట్ లను పోల్చి చూసినప్పుడు, మేము వోటింగ్ తేదీలో వ్యత్యాసాన్ని గమనించాము, అయితే, మిగిలిన అన్ని వివరాలు ఒక్కటిగానే ఉన్నాయి.

గల్ఫ్ దేశాల నుండి వచ్చే ఫ్లైట్స్ యొక్క స్థితికి సంబంధించి మేము మోడల్ టౌన్, ఢిల్లీలో మేక్ మై ట్రిప్ యొక్క కార్యాలయాన్ని సంప్రదించాము మరియు దుబాయ్ నుండి ఢిల్లీకి వచ్చే ఫ్లైట్ లో ఇంకా ఒక సీట్ అందుబాటులో ఉందని మేము తెలుసుకున్నాము.

ఇంతకుముందు, ప్రచారాన్ని వ్యాపింపజేయుటకు రాహుల్ గాంధి మరియు ఆరవింద్ కేజ్రీవాల్ పేరున నకిలీ వార్తాపత్రిక కట్టింగ్స్ వైరల్ అయ్యాయి. విశ్వాస్ న్యూస్ వాటి గురించి వాస్తవ-తనిఖీ నిర్వహించింది మరియు నిజాన్ని వెల్లడించింది.

నకిలీ వార్తను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ యొక్క ప్రొఫైల్ ను మేము స్కాన్ చేశాము. ఈ యూజర్ ఫరీదాబాద్ లో నివసిస్తున్నారు మరియు సుమారు 3300 ఫ్రెండ్స్ ఉన్నారు.

ముగింపు: లోక్ సభ మొదటి దశ వోటింగ్ దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు వచ్చే ఫ్లైట్స్ ఫుల్ గా ఉన్నాయి అని పేర్కొనే వార్తాపత్రిక కట్టింగ్స్ నకిలీవి. దీనికి తప్పుగా మతపరమైన రంగు అద్దారు.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు