X
X

Fact Check: ఒక ఆవు పాఠశాల బాలికపై దాడి చేసిన వీడియో చెన్నైకు సంబంధించినది, ఫరీదాబాద్ కాదు

కొత్త ఢిల్లీ ( విశ్వాస్ న్యూస్). రోడ్డుపై నడుస్తున్న ఒక పాఠశాల బాలికపై ఒక ఆవు దాడిచేసిన వీడియో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఆవు బాలికను తన కొమ్ములతో పైకి ఎత్తి పొడిచినట్లు ఫుటేజ్ లో చూపించబడింది. ఇది ఫరీదాబాద్ లో జరిగింది అని క్లెయిమ్ చేయబడింది.

సోషల్ మీడియాపై వైరల్ అయిన ఈ వీడియో ఫరీదాబాద్ కు చెందినది కాదని, చెన్నై లోని ఎంఎండిఏ కాలనీలో జరిగినది అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ వీడియోలో, ఒక 9-సంవత్సరాల-బాలిక తన తల్లి మరియు సోదరుడితో కలిసి పాఠశాల నుండి తిరిగి వస్తుండగా అనుకోకుండా ఒక ఆవు దాడిచేసింది. ఈ వీడియో ఒక అసత్యపు క్లెయిమ్ తో షేర్ చేయబడింది.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఫేస్‎బుక్ యూజర్ నరేంద్ర కుమార్ (ఆర్కైవ్ లింక్) ఆగస్ట్ 11న ఈ వీడియోను షేర్ చేశారు చేస్తూ ఇలా వ్రాశారు, “పశుసంవర్ధక శాఖపై హర్యాణా ప్రభుత్వం ఎప్పుడు చర్య తీసుకుంటుంది? ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఫరీదాబాద్ లో, ఒక ఆవు ఒక బాలికపై దాడిచేసింది, తత్ఫలితంగా ఆ బాలిక తీవ్రంగా గాయపడింది.”

ఇదే క్లెయిమ్ తో వీడియోను ఫేస్‎బుక్ పై చాలామంది యూజర్స్ కూడా షేర్ చేశారు.

దర్యాప్తు

వైరల్ వీడియో గురించి దర్యాప్తు చేయుటకు, మేము కీవర్డ్స్ తో గూగుల్ పై సెర్చ్ చేశాము (ఆవు బాలిక దాడి). సెర్చ్ సమయములో, వైరల్ వీడియోకు సంబందించిన అనేక వార్తా వెబ్సైట్స్ పై ప్రచురించబడిన అనేక వార్తా నివేదకలు మాకు లభించాయి. అయితే, ఈ వీడియో ఫరీదాబాదుకు చెందినది కాదు, కాని చెన్నైకు సంబంధించినది. వైరల్ వీడియోకు సంబంధించిన ఒక వార్తా నివేదిక దైనిక్ జాగరణ్ పై ఆగస్ట్ 10, 2023 నాడు ప్రచురించబడింది. నివేదిక ప్రకారము, ‘గుండెను పిండేసే ఒక సంఘటన చెన్నైలో వెలుగుచూసింది. ఒక బాలిక తన తల్లి మరియు సోదరుడితో కలిసి పాఠశాల నుండి తిరిగి వస్తుండగా ఒక ఆవు దాడి చేసింది. ఆవు దాడి వలన ఆ బాలిక తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి మరియు సమీప ఆసుపత్రిలో చేర్పించబడింది” వైరల్ వీడియోకు సంబంధించిన వార్తా నివేదికను  జాగరణ్ ఇంగ్లీష్ పై చదవవచ్చు.

వైరల్ వీడియో గురించిన నివేదికను ధృవీకరించబడిన యూట్యూబ్ ఛానల్  ‘న్యూస్7 తమిళ్ ప్రైమ్ ‘ పై చూడవచ్చు. వివరణ ప్రకారము ఈ వీడియో చెన్నైకు సంబంధించినది.

ఆగస్ట్ 11, 2023 నాడు, బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 26-సంవత్సరాల ఆవు యజమానిని అరెస్ట్ చేశారు అని న్యూస్18 తెలియజేసింది. ఆ పశువును నిర్లక్ష్యం చేసినందుకు మరియు స్వేచ్ఛగా తిరగనిచ్చినందుకు అతనిపై అభియోగం మోపబడింది. చీఫ్ సెక్రెటరీ/గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్, జే రాధాకృష్ణన్, ఆ బాలికను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కలిశారు మరియు ఆమె గాయాల  గురించి, ఆమెకు అందించబడిన చికిత్స గురించి విచారించారు. ఇది “చాలా దురదృష్టకరమైన” సంఘటన అని ఆయన దీనిని అభివర్ణించారు మరియు ఆ పశువు యజమానిపై రూ. 25,000 జరిమానా విధించబడినట్లు విలేఖరులకు చెప్పారు. బాలికపై దాడిచేసిన ఆవును కార్పొరేషన్ కార్మికులు పెరంబూర్ లో ఒక పశువుల కొట్టానికి పంపించారు.

వైరల్ సంఘటనకు సంబంధించిన వార్తలు అనేక ఇతర వార్తా వెబ్సైట్స్ పై కూడా చూడవచ్చు. మరింత సమాచారము కొరకు మేము స్థానిక చెన్నై విలేఖరి సురేష్ మూర్తిని సంప్రదించింది. ఆయన ఇలా అన్నారు, “ఈ సంఘటన కొన్ని రోజుల క్రితం చెన్నైలో జరిగింది. తగిన చర్య తీసుకోబడింది. బాలిక ఇప్పుడు బాగుంది మరియు ఆమెకు చికిత్స కొనసాగుతోంది.”

దర్యాప్తు చివరిలో మేము అసత్యపు క్లెయిమ్ తో వీడియోను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ “నరేంద్ర కుమార్’ ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. ప్రొఫైల్ పై సమాచారము ప్రకారము, యూజర్ ఢిల్లీ నివాసి మరియు సుమారు ఆరు వేలమంది ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: పాఠశాల నుండి తిరిగి వస్తున్న బాలికపై ఒక ఆవు దాడి చేయడము చూపించే వైరల్ వీడియో చెన్నై కు చెందినది. ఈ వీడియోకు ఫరీదాబాద్, హర్యాణాకు ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది ఈ వీడియోను చెన్నై నుండి కొంతమంది తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో ఇది ఫరీదాబాద్ లో జరిగింది అని షేర్ చేస్తున్నారు.

  • Claim Review : ఫరీదాబాద్ లో ఆవు ఒక బాలికపై దాడి చేసింది.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ నరేంద్ర కుమారు
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later