X
X

నిజ నిర్దారణ: షారుఖ్ ఖాన్ మరణానికి సంబంధించిన పుకార్లను వ్యాప్తి చేస్తున్న ఈ వైరల్ పోస్ట్ పూర్తిగా అబద్ధం

చివరిగా : షారుఖ్ ఖాన్ మరణానికి సంబంధించిన వైరల్ పోస్ట్ అబద్దం అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో రుజువైంది. సంబంధం లేని ఫోటోలతో ఈ పుకారు పుట్టించారు.

  • By: Ashish Maharishi
  • Published: Nov 8, 2021 at 02:37 PM
  • Updated: Jul 11, 2023 at 11:44 AM

న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్): బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ విమాన ప్రమాదంలో మరణించినట్లు ప్రచారం జరుపుతున్నారు. మూడు ఫోటోలతో ఒక కలగూరగంప సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వాస్ న్యూస్ విచారణలో వైరల్ అయిన పోస్ట్ ఫేక్ అని తేలింది. వైరల్ అవుతున్న ఫోటోలు పాతవి.

క్లయిమ్

మూడు ఫోటోలను షేర్ చేస్తూ, కొంతమంది ఫేస్‌బుక్ యూజర్స్ షారుక్ ఖాన్ విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలిపారు.

ఈ మూడు ఫోటోలలో, మొదటి ఫోటోలో ఒక మృతదేహంతో అనిల్ కపూర్‌ను చూడవచ్చు. రెండవ చిత్రంలో, షారుక్ ఖాన్ ఫోటోని ఒక విమానంతో చూపించారు. షారుక్ విమాన ప్రమాదంలో మరణించినట్లు క్యాప్షన్‌లో తెలిపారు. అప్పుడే, మూడవ ఫోటోలో, షారుక్ ఖాన్ ఫోటోమీద RIP 1965-2021 అని వ్రాశారు.

పోస్ట్ ఆర్కైవ్ చేయబడిన వర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.

విచారణ

ఈ ఫోటోల వెనుక ఉన్న నిజాల వెలికితీసేందుకు విశ్వాస్ న్యూస్ పరిశోధన ప్రారంభించింది. మేము అనిల్ కపూర్ మొదటి ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ ఉపయోగించి అనేక వార్తల వెబ్‌సైట్‌లలో వెతికి తెలుసుకున్నాము. ఈ ఫోటో మార్చి 1, 2018న హిందూస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన వార్తలో వచ్చింది. ముంబైలో శ్రీదేవి అంత్యక్రియల్లో ఆమె మృతదేహంవద్ద అనిల్ కపూర్ నిలబడి ఉన్నట్లుగా ఆ నివేదికలో ఉన్నది. ఈ ఫోటోని పీటీఐ(PTI)  విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ చదవండి.

తరువాత మేము రెండవ ఫోటోని వెతికాము. ఈ ఫోటోలో, ఒక విమానం కూలిపోయి ఉండటం చూడవచ్చు. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, మేము జనవరి 17, 2008 నాటి ఏవియేషన్ యాక్సిడెంట్ అనే వెబ్‌సైట్‌లోని ఒక నివేదికలో అసలు ఫోటోని తెలుసుకున్నాము. అది బ్రిటీష్ ఎయిర్‌వేస్ – బోయింగ్ – B777-236ER (G-YMMM) ఫ్లైట్ BA38. దీని గురించిన మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

ముంబైలోని దైనిక్ జాగరణ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కవర్ చేస్తున్న స్మితా శ్రీవాస్తవతో విశ్వాస్ న్యూస్ మాట్లాడుతూ ఉన్నది. ఆమె ఈ వైరల్ పోస్ట్ ఒక అబద్దం అన్నారు.

వైరల్ పోస్ట్‌ను షేర్ చేసిన యూజర్ ప్రొఫైల్‌ను విశ్వాస్ న్యూస్ స్కాన్ చేసి ఆయన యాంగోన్‌లో ఉన్నట్లుగా తెలుసుకున్నది. ఆయనకి 54 మంది ఫాలోయర్స్ ఉన్నారు.

निष्कर्ष: చివరిగా : షారుఖ్ ఖాన్ మరణానికి సంబంధించిన వైరల్ పోస్ట్ అబద్దం అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో రుజువైంది. సంబంధం లేని ఫోటోలతో ఈ పుకారు పుట్టించారు.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later