X
X

Fact-Check: ఒడిశా రైలు ప్రమాదము పేరున హైదరాబాదు రైలు ప్రమాదం యొక్క పాత వీడియో వైరల్ అవుతోంది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఒడిశా రైలు ప్రమాదం జరిగినప్పటి నుండి, అనేక నకిలీ మరియు తప్పుదోవపట్టించే పోస్టులు సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతున్నాయి. అటువంటి ఒక వీడియో, ఒడిశా రైలు ప్రమాదం యొక్క సిసిటీవి ఫుటేజ్ అనే క్లెయిమ్ ఎక్కువగా షేర్ చేయబడుతోంది. వైరల్ పోస్ట్ పై విశ్వస్ న్యూస్ ఒక వాస్తవ-తనిఖీ నిర్వహించింది మరియు అది తప్పుదోవపటించే క్లెయిమ్ అని కనుగొనింది. వాస్తవానికి, వీడియోలో చూపించబడిన ప్రమాదము నవంబరు 11, 2019 న హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగింది.

ఏది వైరల్ అవుతోంది?

జేకే అప్డేట్ అనే పేరు ఉన్న ఫేస్‎బుక్ పేజ్ జూన్ 4 నాడు ఒక వీడియోను పోస్ట్ చేసి, ఇలా వ్రాయబడింది, “ఒడిశాలోని రైలు ప్రమాదము యొక్క సిసిటివి ఫుటేజ్.” దీనిని అది నిజమని నమ్మి ఇతర యూజర్లు కూడా వేరువేరు ప్లాట్ఫార్మ్స్ పై షేర్ చేస్తున్నారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు:

విశ్వాస్ న్యూస్ వైరల్ క్లిప్ యొక్క మూలాన్ని కనుగొనుటకు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ మరియు గూగుల్ లెన్స్ ను ఉపయోగించింది. దర్యాప్తును కొనసాగిస్తూ, అసలు వీడియో కొరకు యూట్యూబ్ పై సెర్చ్ నిర్వహించబడింది. వేరువేరు కీవర్డ్స్ ఉపయోగించిన తరువాత ఈ వీడియో మూడు సంవత్సరాల క్రితం ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ అనే యూట్యూబ్ ఛానల్ పై పోస్ట్ చేయబడి లభించింది. ఈ సంఘటన నవంబరు 11, 2019 నాడు హైదరాబాదులో జరిగిందని పేర్కొనబడింది మరియు భారతీయ రైల్వేస్ సంఘటన యొక్క సిసిటీవి ఫుటేజ్ ను కూడా విడుదల చేసింది.

ఈ వీడియో ఆధారంగా, సంఘటన గురించిన మరింత సమాచారం సేకరించబడింది. కీవర్డ్ సెర్చ్ ద్వారా, టీవి9 భారత్‎వర్ష్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై మూడు సంవత్సరాల క్రితం అప్లోడ్ చేయబడిన ఒక వార్తా రిపోర్ట్ లభించింది. ఇందులో హైదరాబాదు సమీపములో కాచిగూడ స్టేషన్ వద్ద రెండు రైళ్ళు ఢీకొట్టుకున్నాయి అని పేర్కొనబడింది. ఆ వార్తా రిపోర్ట్ లో సిసిటీవి ఫుటేజ్ ఉంది.

సంఘటనకు సంబంధించిన మరిన్ని వార్తలు Jagran.com పై లభించాయి. నవంబరు 11, 2019 నాడు ప్రచురించబడిన వార్తా రిపోర్ట్ ఇలా పేర్కొనింది, “హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద రెండు రైళ్ళు ఢీకొన్న సంఘటనలో పన్నెండు మంది గాయపడ్డారు. ఉదయం 10.30 సమయములో మల్టీ-మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఎంటిఎస్) రైలు కర్నూల్ సిటి-సికిందరాబాదు రైల్వే ఇంటర్‎సిటి ఎక్స్‎ప్రెస్ రైలును ఢీకొట్టినప్పుడు జరిగింది.”

మరింత దర్యాప్తు చేయుటకు, విశ్వాస్ న్యూస్, హైదరాబాదు జోన్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ అధికారి రాజేష్ కల్యాణ్ ను సంప్రదించింది. ఈ వైరల్ వీడియో పాతదని, ఇది కాచిగూడలో జరిగిందని, ఒడిశా ప్రమాదానికి సంబంధం లేదని ఆయన ధృవీకరించారు. ఆదిత్య కుమార్ చౌదరి, సిపిఆర్‎ఓ, దక్షిణ తూర్పు రైల్వే, కూడా వైరల్ పోస్ట్ నకిలీదని భావించారు మరియు ఒడిశా రైలు ప్రమాదానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు నిర్వహించి, 2019లో హైదరాబాదులో జరిగిన ఒక రైలు ప్రమాదం యొక్క సిసిటీవి ఫుటేజ్ ఇప్పుడు ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన ఫుటేజ్ అని తప్పుగా షేర్ చేయబడుతోంది. వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేదిగా రుజువు అయ్యింది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later