X
X

Fact Check: పూరి జగన్నాథ్ రథయాత్రలో ఉన్న రద్దీ యొక్క ఫోటో తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ అవుతోంది

కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్ – అయోధ్య రామమందిరం లోపల బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయములో, రామ్ లల్లాను చూడటానికి భారీగా భక్తులు వచ్చారు. భక్తులు రాముడి ఆశీస్సుల కొరకు దేశము నలుమూలల నుండి వస్తున్నారు. ఇలా ఉండగా, భారీ జనసమూహాన్ని చూపించే చిత్రము ఒక సోషల్ మీడియాపై వైరల్ అయ్యింది. ఇప్పుడు కొంతమంది యూజర్లు ఈ చిత్రము అయోధ్యలోని రామ భక్తులను చూపుతుందని క్లెయిమ్ చేస్తూ ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు. 

అయితే, విశ్వాస్ న్యూస్ దర్యాప్తు నిర్వహించింది మరియు ఈ క్లెయిమ్ అసత్యము అని నిర్ణయించింది. ఈ వైరల్ చిత్రము అయోధ్య రాముడిని చూపించదని, ఇది పూరి జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన చిత్రము అని మా ఆవిష్కరణలలో తేలింది. ఈ చిత్రము ప్రస్తుతము తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో చక్కర్లుకొడుతోంది మరియు అయోధ్య రామమందిరానికి దీనికి ఏ సంబంధం లేదు.

ఏది వైరల్ అవుతోంది?

వైరల్ చిత్రాన్ని షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ యూజర్ ‘రమేష్ చౌహాన్ జౌన్సారి’ ఇలా వ్రాశారు, “అయోధ్యలో రామ భక్తుల రద్దీ’ ‘జై శ్రీరాం’. ఇలాంటి క్లెయిమ్స్ తో చాలామంది ఇతర యూజర్లు కూడా ఈ చిత్రాన్ని షేర్ చేశారు.

దర్యాప్తు:

వైరల్ అయిన చిత్రము యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు మేము గూగుల్ లెన్స్ ఉపయోగించాము. మా దర్యాప్తు సమయములో, జూన్ 21, 2023 నాడు ప్రచురించబడిన ఈ చిత్రము మాకు ఏబిపి లైవ్ యొక్క మరాఠి వెబ్సైట్ పై లభించింది. వార్త ప్రకారము, వైరల్ చిత్రము, అందుబాటులో ఉన్న ఇతర సంబంధిత చిత్రాలతో పూరి జగన్నాథ్ రథయాత్రను చూపుతుంది. మా తదుపరి పరిశోధన NDTV వెబ్ స్టోరీ  కి తీసుకెళ్ళింది. ఇందులో ఇదే వైరల్ చిత్రము 2023 జగన్నాథ్ పూరి రథయాత్రకు సంబంధించినదిగా గుర్తించబడింది.

వైరల్ చిత్రము గురించిన మరింత సమాచారము టైమ్స్ కంటెంట్ వెబ్సైట్ పై లభించింది, ఇక్కడ “పూర్తిలో వార్షిక జగన్నాత్ రథ యాత్ర: జగన్నాథుని వార్షిక రథ యాత్ర సమయములో భక్తుల రద్దీ” అనే శీర్షికతో పాటు ఫోటో జూన్ 20, 2023 నాడు ప్రచురించబడింది. ఈ సైట్ పై రథయాత్రకు సంబంధించి అనేక ఇతర చిత్రాలు కూడా చూడవచ్చు.

జూన్ 20, 2023 నాడు సంబిత్ పాత్ర, బిజేపి విలేఖరి కూడా రథయాత్ర యొక్క చిత్రాలను షేర్ చేస్తూ, దీనిని జగన్నాథుని రథయాత్ర అని వివరించారు. అనేక ఇతర వెబ్సైట్స్ కూడా వైరల్ చిత్రానికి సంబంధించి సమాచారాన్ని అందించాయి.

మరింత ధృవీకరించుటకు, మేము, ఒడిశా స్థానిక వార్తా పోర్టల్, ఒడిశా డైరీ సంపాదకుడు రష్మి రంజన్ పరిదాను సంప్రదించాము. పరీదా ప్రకారము, “ఈ చిత్రము పూరి జగన్నాథ్ రథయాత్రకు చెందినది.”

చివరిగా, మేము తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ చిత్రాన్ని షేర్ చేసిన యూజర్ ఖాతాను నిశితంగా పరిశీలించాము. ఈ యూజర్ వికాస్ నగర్, ఉత్తరాఖండ్ లో నివసిస్తున్నారని నిర్ణయించబడింది.

ముగింపు: వైరల్ చిత్రములో ఉన్న రద్దీ అయోధ్య రామమందిరానికి చెందినది కాదు, అది జగన్నాథ్ పూరి రథయాత్రకు చెందినది అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఇది అయోధ్య రామమందిరము వద్ద ఉన్న రద్దీకి సంబంధించిన చిత్రము అనే తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో ఈ చిత్రము షేర్ చేయబడింది.

  • Claim Review : అయోధ్యలోని రామ భక్తుల రద్దీ
  • Claimed By : ఫేస్‎బుక్ యూకర్ ‘రమేష్ చౌహాన్ జౌన్సారి’
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later