X
X

వాస్తవ తనిఖీ : ఇది అదానీ సొంత రైలు కాదు, బ్రాండెడ్ లోకోమోటివ్ వీడియో నకిలీ దావాతో వైరల్‌

వైరల్ దావా అబద్ధం. అదానీ యొక్క ఉత్పత్తిని ప్రదర్శించే లోకోమోటివ్ రైల్వేస్ రైలును అదానీకి విక్రయించిందనే తప్పుడు వాదనతో షేర్‌ చేయబడింది. లోకోమోటివ్ బ్రాండింగ్ ప్రకటనల ద్వారా రైల్వేలు ప్రైవేట్ సంస్థల నుండి ఆదాయాన్ని పొందుతాయి.

  • By: Ashish Maharishi
  • Published: Dec 28, 2020 at 09:49 AM
  • Updated: Jul 17, 2024 at 06:01 PM

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : ఇండియన్‌ రైల్వే ప్రైవేటీకరించబడుతోందని, ఒక రైలును వ్యాపారవేత్త గౌతమ్‌ ఆదానీ సొంతం చేసుకున్నాడనే వాదనతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. రైలు ఇంజన్‌కు ఆదానీ విల్మార్‌ అండ్‌ ఫార్చ్యూన్‌ చక్కి ఫ్రెష్‌ ఫ్లోర్‌ అనే లోగో కనిపిస్తోంది. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఇలాంటి వాదనలతో ఈ వీడియోను షేర్‌ చేశారు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ దావా నకిలీదని తేలింది. పశ్చిమ రైల్వేలు నడుపుతున్న లోకోమోటివ్ వైరల్ దావాలో పేర్కొన్నట్లుగా అదానీకి అమ్మబడలేదు. వెస్ట్రన్ రైల్వే PRO వైరల్‌ వాదనను కొట్టిపారేశారు. ఈ వీడియో వారి బ్రాండెడ్ లోకోమోటివ్‌లో ఒకటి అని స్పష్టం చేశారు.

దావా :
అదానీ విల్మార్ మరియు ఫార్చ్యూన్ చక్కి ఫ్రెష్ పిండి ప్రకటనలతో కూడిన రైలు ఆదానీకి అమ్ముడైందనే వాదనతో వైరల్ వీడియో షేర్‌ చేయబడుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన మరియు తన అసమ్మతిని వ్యక్తం చేసిన అనేక మంది యూజర్లలో ఫేస్‌బుక్ యూజర్ విబి సునీల్ ఒకరు.

ఫేస్‌బుక్ పోస్ట్ అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
ఈ వాదనను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ ఇండియన్‌ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనిల్ సక్సేనాను సంప్రదించింది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన ఒక వార్తా కథనాన్ని మాకు షేర్‌ చేసిన సక్సేనా, ఇది కేవలం బ్రాండెడ్ ఇండియన్ రైల్వే లోకోమోటివ్ అని స్పష్టం చేశారు.

రైల్వే సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం, ఇండియన్‌ రైల్వే ఆదాయాన్ని పెంచడానికి గత కొన్ని సంవత్సరాలుగా రైల్ ఇంజిన్లలో బ్రాండింగ్ ప్రవేశపెట్టబడింది. అమూల్ వంటి ఇతర బ్రాండ్ల ప్రకటనలను కూడా రైలు ఇంజన్‌పై చూడవచ్చు.

రైల్వేలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అదానీ మరియు హల్దిరామ్ వంటి సంస్థల వైపు చూస్తున్నాయని పేర్కొన్న మరో వార్తా కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. వడోదరలో, లోకోమోటివ్ బ్రాండింగ్ కోసం అదానీ విల్మార్‌ను కేటాయించారు.

వైరల్ వీడియో ఇంజన్ ముందుభాగంలో వడోదర మరియు అదానీ-విల్మార్‌ బోర్డ్‌ను మేము గమనించాము.

వడోదర వెస్ట్రన్ రైల్వే పరిధిలోకి వస్తుంది, దీంతో విశ్వాస్ న్యూస్ మరింత ధృవీకరణ కోసం వెస్ట్రన్ రైల్వే యొక్క PRO ఖేమరాజ్ మీనాను సంప్రదించింది.

ఏదైనా ప్రైవేట్ సంస్థ తన ఉత్పత్తులను కాంట్రాక్టుపై ప్రకటించవచ్చని ఆయన మాకు వివరించారు. ‘ఇది మొదటిసారి కాదు. ఇది ఇప్పటికే జరుగుతోంది. రైల్వేను అదానీకి విక్రయించామని చెప్పడం పూర్తిగా తప్పు,’ అని మీనా చెప్పారు.

అదానీ గ్రూప్ ఆఫ్ ఇండియా మరియు విల్మార్ ఇంటర్నేషనల్ ఆఫ్ సింగపూర్ సంస్థల జాయింట్ వెంచర్ అదానీ-విల్మార్.

ఫేస్‌బుక్‌లో 3,575 మంది స్నేహితులు, 1,643 మంది ఫాలోవర్లు ఉన్నారని వీడియోను షేర్ చేసిన యూజర్ సోషల్ స్కానింగ్‌లో వెల్లడైంది. అతను ఛత్తీస్‌గఢ్‌‌లోని భిలాయ్ నివాసి.

निष्कर्ष: వైరల్ దావా అబద్ధం. అదానీ యొక్క ఉత్పత్తిని ప్రదర్శించే లోకోమోటివ్ రైల్వేస్ రైలును అదానీకి విక్రయించిందనే తప్పుడు వాదనతో షేర్‌ చేయబడింది. లోకోమోటివ్ బ్రాండింగ్ ప్రకటనల ద్వారా రైల్వేలు ప్రైవేట్ సంస్థల నుండి ఆదాయాన్ని పొందుతాయి.

  • Claim Review : అదానీ విల్మార్ మరియు ఫార్చ్యూన్ చక్కి ఫ్రెష్ పిండి ప్రకటనలతో కూడిన రైలు ఆదానీకి అమ్ముడైందనే వాదనతో వైరల్ వీడియో షేర్‌ చేయబడుతోంది.
  • Claimed By : FB User
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later