X
X

వాస్తవ తనిఖీ: పాత వీడియో కరోనావైరస్‌ పేరిట వైరల్, WHO, ICMRకు తప్పుగా ఆపాదించబడింది

భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందడం ద్వారా మొత్తం మరణాల సంఖ్య 2020 మార్చి నాటికి 50,000 సంఖ్యకు చేరుకుంటుందని WHO లేదా ICMR ఫిబ్రవరి 2020 లో హెచ్చరించలేదు. ఈ వీడియో పాతది మరియు నకిలీది.

  • By: Urvashi Kapoor
  • Published: Dec 17, 2020 at 02:33 PM
  • Updated: Dec 17, 2020 at 05:04 PM

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరిక జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పేర్కొంది. భారత్‌లో కరోనా వైరస్ మూడవ దశ వ్యాప్తి మొదలు కాబోతోందని, డబ్ల్యూహెచ్‌ఓ, ఐసిఎంఆర్ హెచ్చరిస్తున్నాయని, ఒకవేళ ఇలాగే వదిలేస్తే, భారతదేశంలో కరోనావైరస్‌ మరణాల సంఖ్య మార్చి నాటికి 50,000కు చేరుకుంటుందని హెచ్చరించారు. ఈ వీడియోలో న్యూస్ 24 ఆన్‌లైన్ లోగోను కూడా గమనించవచ్చు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, ఈ వైరల్ వీడియో నకిలీదని కనుగొంది. న్యూస్ 24 ఆన్‌లైన్ నకిలీ లోగోతో ఈ వీడియో ఫిబ్రవరి 2020 నుండి చెలామణిలో ఉంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2020 డిసెంబర్ 2 నాటికి భారతదేశంలో 4,28,644 యాక్టివ్‌ కరోనావైరస్ కేసులు మరియు 1,38,122 మరణాలు నమోదయ్యాయి. వైరల్ వీడియో అంచనాలను బేరీజు వేసి.. WHO ప్రచురించిన గణాంకాల ప్రకారం, 2020 మార్చి 28 నాటికి, భారతదేశంలోని 27 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో 909 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు మరియు 19 కరోనావైరస్ మరణాలు నిర్ధారించబడ్డాయి.

2020 మార్చిలో భారతదేశం కరోనావైరస్ మూడవ దశ సంక్రమణంలోకి ప్రవేశిస్తుందని మరియు 2020 మార్చి నాటికి మరణాల సంఖ్య 50,000 కు చేరుకుంటుందని WHO లేదా ICMR ధృవీకరించలేదు.

విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో 2020 డిసెంబర్ 1వ తేదీన ఈ వీడియోను వాస్తవ తనిఖీ కోసం అందుకుంది.

దావా :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరిక జారీ చేసినట్లు విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో అందుకున్న వీడియో పేర్కొంది. భారత్‌లో కరోనా వైరస్ మూడవ దశ వ్యాప్తి మొదలు కాబోతోందని, డబ్ల్యూహెచ్‌ఓ, ఐసిఎంఆర్ హెచ్చరిస్తున్నాయని, ఒకవేళ ఇలాగే వదిలేస్తే, భారతదేశంలో కరోనావైరస్‌ మరణాల సంఖ్య మార్చి నాటికి 50,000కు చేరుకుంటుందని హెచ్చరించారు. ఈ వీడియోలో న్యూస్ 24 ఆన్‌లైన్ లోగోను కూడా గమనించవచ్చు.

దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, 2020 డిసెంబర్‌లో వాట్సాప్ చాట్‌బాట్‌లో మాకు వచ్చిన వీడియో ఫిబ్రవరి 2020 నుండి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతోందని కనుగొనడం జరిగింది.

ఫిబ్రవరి 2020 లో, WHO లేదా ICMR వైరల్ పోస్ట్‌లో ప్రచారం అవుతున్న మేరకు ఏదైనా ప్రకటన చేశారా అని మేము పరిశోధించాము.

లైవ్‌మింట్‌లో ప్రచురించిన ఒక వార్తా కథనాన్ని మేము కనుగొన్నాము, ఐసిఎంఆర్ ఇటీవల భారతదేశంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగే అవకాశం ఉందని ప్రకటన చేసింది. కానీ, కేసుల సంఖ్య పెరగడానికి ఇరవై రోజుల నుండి ఒక నెల రోజుల వరకు పట్టవచ్చు.

అయితే, భారతదేశంలో కరోనా మూడవ దశలోకి ప్రవేశిస్తుండటంతో ఆ వైరస్ కారణంగా 2020 మార్చిలో 50,000 మంది చనిపోతారని ఎక్కడా చెప్పలేదు.

అలాగే, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ జారీచేసిన సంబంధిత ప్రకటన ఏదీ మాకు దొరకలేదు.

వైరస్ పోస్ట్‌కు సంబంధించి WHO హెల్త్ ఎమర్జెన్సీ విభాగమైన SEARO టెక్నికల్ ఆఫీసర్‌తో విశ్వాస్ న్యూస్ మాట్లాడటం జరిగింది. ‘ఈ వీడియో చాలా కాలం నుండి ఆన్‌లైన్‌లో ఉంది. WHO ఫిబ్రవరి లేదా మార్చి 2020 లో అలాంటి ప్రకటన చేయలేదు.’ అని ఆమె మాకు చెప్పారు.

మేము మరింత పరిశోధించి, WHO ప్రచురించిన డేటాను కనుగొన్నాము. ఆ డేటా ప్రకారం, మార్చి 28, 2020 నాటికి, భారతదేశంలోని 27 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో 909 కరోనావైరస్ కేసులు మరియు 19 కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయి.

వైరల్ పోస్ట్‌లోని అంచనాల ప్రకారం 2020 మార్చిలో భారతదేశంలో 50,000 మరణాలు సంభవించలేదు.

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, 2020 డిసెంబర్ 2వ తేదీ నాటికి భారతదేశంలో 4,28,644 యాక్టివ్‌ కరోనా వైరస్ కేసులు మరియు 1,38,122 మరణాలు నమోదయ్యాయి.

వైరల్ వీడియోతో పాటు.. దాని వాయిస్ ఓవర్ వింటున్నప్పుడు, ఇది స్పష్టంగా నకిలీదని అర్థమవుతోంది. వీడియోలో నాణ్యతకు సంబంధించిన సమస్యలు మరియు వాయిస్ ఓవర్‌లో బ్రేక్స్‌ ఉన్నాయి, లోగో కూడా వీడియోలో సూపర్‌ ఇంపోజ్‌ చేయబడింది.

DISCLAIMER: విశ్వాస్ న్యూస్ యొక్క కరోనా వైరస్ (COVID-19) కు సంబంధించిన ఫాక్ట్ చెక్ స్టోరీని చదివేటప్పుడు లేదా షేర్‌ చేసుకునేటప్పుడు, ఉపయోగించిన డేటా లేదా పరిశోధన డేటా ఎప్పటికప్పుడు మారుతుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు మారుతుందంటే ఈ అంటువ్యాధికి సంబంధించిన గణాంకాలు (వైరస్‌ సోకిన మరియు నయం చేయబడిన రోగుల సంఖ్య, మరణాల సంఖ్య) నిరంతరం మారుతూ ఉంటాయి. అదే సమయంలో, ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనే దిశగా కొనసాగుతున్న పరిశోధనల యొక్క ఖచ్చితమైన ఫలితాలు ఇంకా రాలేదు. ఈ కారణంగా, చికిత్స మరియు నివారణకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా కూడా మారవచ్చు. అందువల్ల కథనంలో ఉపయోగించిన డేటాను దాని తేదీ సందర్భంలో చూడటం చాలా ముఖ్యం.

निष्कर्ष: భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందడం ద్వారా మొత్తం మరణాల సంఖ్య 2020 మార్చి నాటికి 50,000 సంఖ్యకు చేరుకుంటుందని WHO లేదా ICMR ఫిబ్రవరి 2020 లో హెచ్చరించలేదు. ఈ వీడియో పాతది మరియు నకిలీది.

  • Claim Review : భారత్‌లో కరోనా వైరస్ మూడవ దశ వ్యాప్తి మొదలు కాబోతోందని, డబ్ల్యూహెచ్‌ఓ, ఐసిఎంఆర్ హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ఇలాగే వదిలేస్తే, భారతదేశంలో కరోనావైరస్‌ మరణాల సంఖ్య మార్చి నాటికి 50,000కు చేరుకుంటుంది.
  • Claimed By : Whatsapp user
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later