Fact Check: ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాహుల్ గాంధి చంద్రబాబు నాయుడిని కలవలేదు, వైరల్ ఫోటో 2019 కు సంబంధించినది

Fact Check: ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాహుల్ గాంధి చంద్రబాబు నాయుడిని కలవలేదు, వైరల్ ఫోటో 2019 కు సంబంధించినది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్)। లోక్‎సభ ఎన్నికలు 24 ఫలితాలు వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ (టిడిపి) నేత చంద్రబాబు నాయుడు, రాష్ట్రీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‎డిఏ) సమావేశములో పాల్గొనుటకు ఢిల్లీకి వెళ్ళారు. ఈ నేపథ్యములో సోషల్ మీడియాపై వైరల్ అయిన ఒక చిత్రానికి సంబంధించి, చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటన సమయములో రాహుల్ గాంధిని కలిసి ఆయనను అభినందించారు అని క్లెయిమ్ చేయబడుతోంది.

ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని మేము మా దర్యాప్తులో కనుగొన్నాము. రాహుల్ గాంధితో చంద్రబాబు నాయుడు కలిసిన ఈ చిత్రము లోక్‎సభ ఎన్నికలు 2024 నాటికి కాదు, అది 2019 నాటి పాత చిత్రము, దానిని ఇప్పుడు తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు. 

ఏది వైరల్ అవుతోంది?

సోషల్ మీడియా యూజర్ ‘విశాఖ జాట్ని’ వైరల్ అయిన ఈ చిత్రము (ఆర్కైవ్ లింక్) షేర్ చేశారు, ఇందులో రాహుల్ గాంధి వెంబడి చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారు.

దర్యాప్తు

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపితో పొత్తుతో ఎన్నికలలో పోటీ చేశారు మరియు వార్తా నివేదికల ప్రకారము, ఆయన ఎన్నికల తరువాత ఎన్‎డిఏ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) తో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. 

సెర్చ్ లో మాకు ఇలాంటి అనేక నివేదికలు లభించాయి. వీటిల్లో చంద్రబాబు నాయుడు ఎన్‎డిఏ సమావేశము కొరకు ఢిల్లీకి వస్తున్నారు అని ప్రస్తావించబడింది. వార్తా ఏజెన్సీ ఏఎన్‎ఐ నివేదిక (ఆర్కైవ్ లింక్) ప్రకారము, ప్రధానమంత్రి నివాసములో ఎన్‎డిఏ పార్టీలు సమావేశము అయ్యాయి.

ఏజెన్సీ నివేదికల (ఆర్కైవ్ లింక్) ప్రకారము, ఈ సమావేశములో ఇతర మిత్రపక్షాలతో పాటు తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.

అంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎన్‎డిఏ సమావేశములో పాల్గొనేందుకు వచ్చారు మరియు ఆయన రాహుల్ గాంధిని కలవలేదు. వైరల్ చిత్రము యొక్క ఒరిజినల్ షేర్స్ సెర్చ్ చేయటానికి మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయం తీసుకున్నాము. సెర్చ్ లో మాకు ఈ చిత్రము పాత నివేదికలలో జతచేయబడి కనిపించింది, దీనికి ఇప్పటి ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.

‘హిందుస్తాన్ టైమ్స్’ యొక్క జనవరి 8, 2019 నాటి నివేదిక లో ఈ చిత్రము ఉపయోగించబడింది మరియు అక్కడ ఇవ్వబడిన సమాచారము ప్రకారము, నాయుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ తో పొత్తు కొరకై రాహుల్ గాంధిని కలిశారు.

చాలా ఇతర నివేదికలలో (ఆర్కైవ్ లింక్) వారి ఈ సమావేశము గురించిన ప్రస్తావన చేయబడింది మరియు ఈ చిత్రము వినియోగించబడింది.

https://twitter.com/ndtv/status/1082638850797621248

చాలామంది ఇతర యూజర్స్ (ఆర్కైవ్ లింక్) కూడా నాయుడు మరియు రాహుల్ గాంధిల సమావేశము యొక్క ఇతర చిత్రాలను షేర్ చేస్తూ రాహుల్ గాంధిని ప్రధానమంత్రి చేయాటానికి నాయుడు అంగీకరించారని క్లెయిమ్ చేశారు.

ఈ చిత్రము పాతది అని మేము మా దర్యాప్తులో కనుగొన్నాము. రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో ఈ చిత్రము లైవ్‎మింట్.కామ్ అనే వెబ్సైట్ పైన నవంబరు 28, 2018 నాడు ప్రచురించబడిన నివేదికలో లభించింది.

ఇవ్వబడిన సమాచారము ప్రకారము, ఇద్దరు నేతల మధ్య జరిగిన సమావేశము యొక్క చిత్రము తెలంగాణకు చెందిన ఖమ్మంకు సంబంధించినది, అక్కడ ఇద్దరు నేతలు సభను ఉద్దేశించి ప్రసంగించారు.

విశ్వాస్ న్యూస్ తో జరిగిన సంభాషణలో నాయుడు ఎన్‎డిఏ సమావేశములో పాల్గొనుటకు ఢిల్లీ వచ్చారని మరియు ఆయన రాహుల్ గాంధిని కలవలేదని న్యూస్ ఛానల్ టీవి9 యొక్క పొలిటికల్ ఎడిటర్ అమోద్ రాయ్ తెలిపారు.

లోక్‎సభ ఎన్నికలు 2024 ఫలితాలు వచ్చేశాయి మరియు ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం, బిజేపి 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది, కాగా కాంగ్రెస్ పార్టీ మొత్తం 99 సీట్లు గెలుచుకుంది. 

ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 25 లోక్‎సభ సీట్లలో చంద్రబాబు నాయుడు పార్టీ టిడిపికి 16, బిజేపికి 3 మరియు జేఎన్‎పీ పార్టీకి రెండు సీట్లు లభించాయి, అయితే వైఎస్‎ఆర్‎సిపి పార్టీ కేవలం నాలుగు సీట్లతో సంతృప్తి చెందవలసి వచ్చింది.

వైరల్ అయిన చిత్రాన్ని తప్పుదోవపట్టించే క్లెయిమ్ తోపాటు షేర్ చేసిన యూజర్  ను ఫేస్‎బుక్ పై సుమారు రెండు లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎన్నికలకు సంబంధీంచి ఇతర తప్పుదోవపట్టించే మరియు నకిలీ క్లెయిమ్స్ గురించి దర్యాప్తు చేసిన ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్స్ ను విశ్వాస్ న్యూస్ యొక్క ఎన్నికల విభాగములో చదవవచ్చు.

ముగింపు: లోక్‎సభ ఎన్నికలు 24 తరువాత, రాహుల్ గాంధి మరియు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు అని చేసిన క్లెయిమ్ నకిలీది మరియు దీని వెంబడి వైరల్ అవుతున్న చిత్రము 2019 నాటిది. అప్పుడు ఎన్నికల ముందు నాయుడు ఢిల్లీలో పొత్తుకు సంబంధించి రాహుల్ గాంధిని కలిశారు.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు