X
X

Fact Check: మిథున్ చక్రవర్తి మరణము గురించిన నకిలీ సందేశము వైరల్ అవుతోంది

  • By: Ashish Maharishi
  • Published: Feb 22, 2024 at 09:14 PM
  • Updated: Feb 22, 2024 at 09:55 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్) ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని ఫిబ్రవరి 10వ తేదీన, ఛాతీలో నొప్పి అని ఆయన చెప్పిన తరువాత కోల్కత్తాలోని ఒక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. 73-సంవత్సరాల నటుడికి చికిత్స అందించిన తరువాత డిస్చార్జ్ చేశారు. అయితే, ఆయన కోలుకోకముందే, సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై మిథున్ మరణించారు అనే క్లెయిమ్ తో ఒక సందేశము ప్రచారం చేయబడింది. ఈ క్లెయిమ్ నిజము అని అనుకుంటూ, వివిధ ప్లాట్ఫార్మ్స్ పై ఉన్న ఫ్యాన్స్ ఆయనకు నివాళి అందించారు. విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ సందేశము గురించి దర్యాప్తు జరిపి, అది అసత్యము అని కనుగొనింది. మిథున్ చక్రవర్తి మరణానికి సంబంధించిన క్లెయిమ్స్ నకిలీవి.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఫేస్‎బుక్ యూజర్ బెహ్పూర్‎పుష్కర్999 ఫిబ్రవరి 14న ఒక సందేశములో ఈ విధంగా వ్రాశారు, ‘ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఇకలేరు.”

దర్యాప్తు:

మిథున్ చక్రవర్తి మరణనికి సంబంధించిన సందేశాన్ని ధృవీకరించుటకు, మేము ముందుగా గూగుల్ ఓపెన్ సెర్చ్ టూల్ ఉపయోగించాము. సెర్చ్ చేసిన తరువాత, అనేక వార్తా వెబ్సైట్లు వివరాలను అందిస్తూ మిథున్ చక్రవర్తి ఆసుపత్రిలో చేరిన విషయముపై రిపోర్ట్ చేశాయి . ఇండియా టివి ఫిబ్రవరి 12న ఒక వార్తను ప్రచురించింది, “శనివారం ఉదయం ఐసెమిక్ సెరిబ్రోవాస్క్యులార్ వ్యాధి లక్షణాలు కనిపించిన తరువాత నటుడు మరియు బిజేపి నేత మిథున్ చక్రవర్తిని కోల్కత్తాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఆయనను ఆసుపత్రి నుండి డిస్చార్జ్ చేశారు.”

సెర్చ్ సమయములో, Bhaskar.com పై కూడా ఒక నివేదిక కనిపించింది. ఇందులో ఇలా పేర్కొనబడింది, “ప్రముఖ నటుడు మరియు బిజేపి నేత మిథున్ చక్రవర్తిని ఆసుపత్రి నుండి డిస్చార్జ్ చేశారు. ఫిబ్రవరి 10వతేది ఉదయం ఛాతిలో నొప్పి కారణంగా కోల్కత్తాలోని అపోలో అసుపత్రిలో ఆయనను అడ్మిట్ చేశారు. సోమవారం నాడు, 73-సంవత్సరాల-నటుడు ఆసుపత్రి నుండి డిస్చార్జ్ అయి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగుందని, తొందరలోనే తిరిగి పని మొదలుపెడతారని ఆయన చెప్పారు. అలాగే తన ఆరోగ్యం క్షీణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ తిట్టారు అని కూడా మిథున్ తెలిపారు.”

దర్యాప్తును కొనసాగిస్తూ, విశ్వాస్ న్యూస్ దైనిక్ జాగరణ్ లో ముంబైలోని బాలీవుడ్ కవరేజ్ ను చూసే సీనియర్ విలేఖరి అయిన స్మిత శ్రీవాస్తవను కలిశారు. వైరల్ పోస్ట్ నకిలీది అని శ్రీవాస్తవ ధృవీకరించారు.

దర్యాప్తు సమయములో వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన బెహ్పూర్‎పుష్కర్999 అనే పేరు కలిగిన ఫేస్‎బుక్ యూజర్ ను నిశితంగా పరిశీలించారు. ఈ ఖాతాకు 52,000 లైక్స్ ఉన్నాయి మరియు 66,000 ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, మిథున్ చక్రవర్తి మరణానికి సంబంధించిన పోస్ట్ అసత్యము అని కనుగొనబడింది. అకస్మాత్ అనారోగ్యము కారణంగా మిథున్ చక్రవర్తిని ఆసుపత్రిలో చేర్చారు, కాని ఆయన పూర్తిగా కోలుకున్నారు మరియు ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగుంది.-

  • Claim Review : ఫేస్‎బుక్ యూజర్ బెహ్పూర్‎పుష్కర్999 ఫిబ్రవరి 14న, ఒక సందేశములో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఇకలేరు” అని వ్రాశారు.”
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ బెహ్పూర్‎పుష్కర్999 ఫిబ్రవరి 14న, ఒక సందేశములో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఇకలేరు” అని వ్రాశారు.”
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later