X
X

నిజ నిర్ధారణ : వరద నీటిలో మునిగిపోతున్న ప్రజల వీడియో భారత్ కి సంబంధించినది, పాకిస్తాన్ కి కాదు

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేదిగా నిరూపించబడింది. వైరల్ వీడియో 2011 లో జరిగిన సంఘటన. అది కూడా పాకిస్తాన్ లో కాదు భారతదేశంలో జరిగినది అని దర్యాప్తులో తేలింది. ఈ ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్). సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫారమ్ లలో ఒక వీడియో వైరల్ అయ్యింది. దానిలో, కొంతమంది భారీ వరదల ప్రవాహంలో కొట్టుకుపోవడం కనిపిస్తుంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో పాకిస్తాన్ కి సంబంధించినది అని వైరల్ చేస్తున్నారు.

ఈ వైరల్ పోస్ట్ ను విశ్వాస్ న్యూస్ పరిశోధించింది. ఈ వైరల్ వీడియో 2011 లో భారతదేశంలో జరిగినదని దర్యాప్తులో తెలిసింది. ఈ ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది.

వైరల్ అవుతున్న విషయం ఏమిటి

ఫేస్ బుక్ యూజర్ తస్బీహ్ ఉల్లా సంగర్ తురంగ్జాయ్ (ఆర్కైవ్) ఈ వీడియో పాకిస్తాన్ కి చెందినదని తెలిపారు : ‘ఖైబర్ పఖ్తుంఖ్వా వరదలలో ఒక కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది.

విచారణ

విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ లో వైరల్ అయిన వీడియో స్క్రీన్ గ్రాబ్ లను సెర్చ్ చేసింది. ఈ వీడియో NDTV.com 2011 వార్తా కథనాలలోనిదని మాకు తెలిసింది. ఈ వార్త ప్రకారం, “ఇండోర్ లోని ఒక కుటుంబానికి పిక్నిక్ విషాదంగా మారింది. పాతాళపానీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు జలపాతంలో కొట్టుకుపోయారు.

ఈ పూర్తి వీడియోను 2011 లో వైల్డ్ ఫిల్మ్స్ ఇండియా అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసినట్లు కూడా మేము చూశాము. ఈ వీడియోలో వివరణ “ఇండోర్ లో సంభవించిన భారీ వరదలలో ఒక కుటుంబం కొట్టుకుపోయింది” అని ఉంది.

Indiatoday.in లో కూడా ఇండోర్ లో జరిగిన ఈ 2011 సంఘటన గురించిన వార్తను మేము చూశాము

మాకు తెలిసిన ఈ విషయం గురించి ఇండోర్ డిజిటల్ డెస్క్ హెడ్, రుమాని ఘోష్ గారితో మాట్లాడాము. వారు ఈ వీడియో ఇండోర్ కు సంబంధించినది అని, ఇంక ఇది 2011 నాటిది అని కూడా ధృవీకరించారు.

పాకిస్తాన్ లో వరదల విధ్వంసం చాలా ఎక్కువగా కొనసాగుతోందని, వరదల వల్ల దెబ్బతిన్న వారి వీడియోలు పొరుగు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి బయటకు వస్తున్నాయని మీకు వివరిస్తాము. పాకిస్తాన్ లో వరదల గురించిన మరింత సమాచారం జాగరణ్ వారి ఈ వార్తలలో చదవవచ్చు.

ఇన్వెస్టిగేషన్ చివరలో భారత్ లో జరిగిన దానిని పాకిస్తాన్ లో అంటూ వైరల్ చేసిన వీడియోను తయారు చేసిన యూజర్ గురించి విచారించాము. ఫేస్ బుక్ యూజర్ తస్బీహ్ ఉల్లా సంగర్ తురాంగ్ జాయ్ కు 9000 మందికి పైగా ఫేస్ బుక్ ఫాలోవర్లు ఉన్నారు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేదిగా నిరూపించబడింది. వైరల్ వీడియో 2011 లో జరిగిన సంఘటన. అది కూడా పాకిస్తాన్ లో కాదు భారతదేశంలో జరిగినది అని దర్యాప్తులో తేలింది. ఈ ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది.

  • Claim Review : ఖైబర్ పఖ్తుంఖ్వాలో వరదలు ఒక కుటుంబాన్ని మొత్తంగా ముంచెత్తాయి.
  • Claimed By : ఫేస్ బుక్ యూజర్ తస్బీహ్ ఉల్లా సంగర్ తురంగ్ జాయ్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later