X
X

Fact Check: లోక్‎సభ ఎన్నికలు 2024 ముందు ఎడిట్ చేయబడిన కాంగ్రెస్ బహిరంగ సభ యొక్క పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది

కొత్త ఢిల్లీ విశ్వాస్ న్యూస్ – లోక్‎సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియా పై కాంగ్రెస్ ర్యాలీని చూపిస్తున్న వీడియో ఒకటి తెరపైకి వచ్చింది, ఇందులో కొంతమంది ‘మోడీ-మోడీ’ అని అంటూ కనిపిస్తారు. కొంతమంది యూజర్లు ఈ సంఘటన, ప్రజలు ప్రధాని మోడీకి మద్దతు పలికిన, అహ్మదాబాద్, గుజరాత్ లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ సందర్భములో జరిగిందని క్లెయిమ్ చేస్తున్నారు. 

విశ్వాస్ న్యూస్ ఒక దర్యాప్తు జరిపి ఈ వైరల్ వీడియో తారుమారు చేయబడిందని కనుగొనింది. అసలైన ఫుటేజ్ ఆరున్నర సంవత్సరాల క్రితం తీయబడింది, ఇందులో గుజరాత్ లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీని చూపుతుంది, నిజానికి ఇందులో హాజరైన వారు రాహుల్ గాంధికి మద్ధతు పలికారు. ప్రధాని మోడీకి మద్ధతు పలుకుతున్న ఆడియో విడిగా చొప్పించబడింది.

ఏది వైరల్ అవుతోంది?

వైరల్ పోస్ట్ ‘సురేందర్ పాల్ సింగ్’ (ఆర్కైవ్ లింక్) అనే ఫేస్‎బుక్ యూజర్ మార్చ్ 18 నాడు కాంగ్రెస్ పార్టీని అవమానించారని సూచిస్తూ ఒక శీర్షికతో షేర్ చేశారు. అహ్మదాబాద్ ర్యాలీలో, కాంగ్రెస్ నేత అల్పేష్ ఠాకుర్, రాహుల్ గాంధి కోసం ఆనందోత్సహాలు పలికారు, కాని అక్కడి గుంపు “మోడీ జిందాబాద్’ అనే నినాదాలతో స్పందించింది, అంటే ఇది ప్రజల అభిప్రాయములో మార్పును సూచిస్తుంది, అని సింగ్ క్లెయిమ్ చేశారు.

దర్యాప్తు:

వైరల్ వీడియో యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, గూగుల్ లెన్స్ ఉపయోగించి కీఫ్రేమ్స్ సంగ్రహించబడ్డాయి మరియు సెర్చ్ చేయబడ్డాయి. అక్టోబరు 24, 2017 నాడు అప్లోడ్ చేయబడిన ఈ సందర్భానికి సంబంధించిన వీడియో ఒకటి గుజరాత్ కాంగ్రెస్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై మాకు లభించింది. ఈ వీడియో గాంధీనగర్ లో జరిగిన నవసర్జన్ జనసందేశ్ మహాసమ్మేళన్ ను డాక్యుమెంట్ చేసింది. ఇందులో సుమారు 33-నిమిషాల మార్క్ వద్ద హాజరైన వాళ్ళు రాహుల్ గాంధికి మద్ధతుగా ‘జిందాబాద్ జిందాబాద్’ అని పలకడం చూడవచ్చు.

జీవన్ కపూరియా, అసోసియేట్ ఎడిటర్, గుజరాత్ దైనిక్ జాగరణ్, దీనిని విశ్లేషించినప్పుడు, వైరల్ వీడియో యొక్క ఎడిట్ చేయబడిన స్వభావము ధృవీకరించబడింది. అసలైన ఫుటేజ్, సుమారు ఏడున్నర సంవత్సరాల క్రితం గాంధీనగర్ లో జరిగిన నవసర్జన్ జనసందేశ్ మహాసమ్మేళన్ కు చెందినది అని, ఈ సందర్భాన్ని తప్పుగా చూపించుటకు ఎడిట్ చేయబడిందని ఆయన పేర్కొన్నారు.

తారుమారు చేయబడిన వీడియోను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ కు ఈ వేదికపై సుమారు 608 స్నేహితులు ఉన్నారు.

ముగింపు: గుజరాత్ లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో హాజరైన వారు ప్రధాని మోడీకి మద్ధతు పలికారని సూచించే విధంగా వైరల్ వీడియో మార్చబడింది. నిజానికి అసలైన వీడియో అక్టోబరు 2017లో గాంధీనగర్ లో జరిగిన నవసర్జన్ జనసందేశ్ మహాసమ్మేళన్ వద్ద రాహుల్ గాంధీకి మద్ధతు పలకడం చూపుతుంది.

  • Claim Review :  అహ్మదాబాద్, గుజరాత్ లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ వద్ద ప్రధాని మోడీకి మద్ధతుగా ప్రజలు నినాదాలు చేశారు.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ‘సురేందర్ పాల్ సింగ్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later