X
X

Fact Check: ఒక పేలుడులో తీవ్రవాది మసూద్ అజ్హర్ మరణాన్ని క్లెయిమ్ చేస్తున్న వీడియో పాతది

  • By: Umam Noor
  • Published: Jan 26, 2024 at 03:31 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): భారీ పేలుడిని చూపించే వీడియో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ పై వైరల్ అవుతోంది. జైష్-ఎ-మొహమ్మద్ అధినేత మరియు భారతదేశపు మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అయిన మౌలానా మసూద్ అజ్హర్ పాకిస్తాన్ లో ఒక పేలుడులో చంపబడ్డాడు అనే క్లెయిమ్స్ తో యూజర్లు వీడియోను షేర్ చేస్తున్నారు.

వైరల్ అయిన వీడియో నవంబరు 2023లో ఖైబర్ పాఖ్తున్ఖ్వా, పాకిస్తాన్ లో సంభవించిన ఒక విస్ఫోటనానికి సంబంధించినది అని, అది ఇటీవలి సంఘటన కాదని, దర్యాప్తు జరిపిన తరువాత విశ్వాస్ న్యూస్ కనుగొనింది. అంతేకాకుండా, తీవ్రవాది మౌలానా మసూద్ అజ్హర్ మరణానికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ కూడా లేదు.

ఏది వైరల్ అవుతోంది?

వైరల్ పోస్ట్ (ఆర్కైవ్ లింక్) ను షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ యూజర్ ఇలా వ్రాశారు, “మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది మౌలానా మసూద్ అజ్హర్ పాకిస్తాన్ లోని భవల్పూర్ మసీదు నుండి తిరిగి వస్తున్నారు. ఆయన ఒక పేలుడులో చంపబడ్డారు. ఆయనను ఎందుకు చంపారో నేను మీకు తరువాత చెప్తాను.”

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు

దర్యాప్తును ప్రారంభిస్తూ, విశ్వాస్ న్యూస్ గూగుల్ లెన్స్ ఉపయోగించి వైరల్ అయిన వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ కొరకు సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఈ వీడియో యూరప్ కాగ్నిజెంట్స్ X (ట్విట్టర్) హ్యాండిల్ పై నవంబరు 4, 2023 నాడు అప్లోడ్ చేయబడిందని ఈ సెర్చ్ లో మేము కనుగొన్నాము. అందించబడిన సమాచారము ప్రకారము, డేరా ఇస్మాయిల్ ఖాన్ లో ఒక పోలీసు వాహనము లక్ష్యంగా ఆరోజు పేలుడు జరిగింది, దీనిలో 6 మంది మరణించారు మరియు 25 మంది గాయపడ్డారు.

దర్యాప్తును ముందుకు కొనసాగించగా, మాకు నవంబరు 3, 2023 నాడు టిఆర్‎టి వెబ్సైట్ పై ప్రచురించబడిన సంబంధిత వార్త కనిపించింది. ఈ వార్తా నివేదిక ప్రకారం, డేరా ఇస్మాయిల్ ఖాన్ లోని ఒక ట్యాంక్ బేస్ వద్ద ఉన్న ఒక పోలీసు వ్యాన్ దగ్గర పేలుడు సంభవించింది. 5 మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు మరియు 20 మంది గాయాలపాలైయ్యారు అని, వారిని సమీప ఆసుపత్రికి తరలించారు అని పోలీసులు పేర్కొన్నారు. ఒక పోలీసు వ్యాను లక్ష్యంగా ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక సమాచారము సూచించింది.

వాయిస్ ఆఫ్ అమెరికా ఉర్దూ నుండి తదుపరి వివరాలు సేకరించబడ్డాయి, ఆ నివేదిక ప్రకారం “డిఐ ఖాన్ యొక్క ట్యాంక్ బేస్ వద్ద జరిగిన పేలుడులో పౌరులు కూడా చనిపోయారు, అలాగే పోలీసులు మరియు ఇతర భద్రతా అధికారులు గాయపడ్డారు.”

Tribune.pk వెబ్సైట్ లో అందించబడిన సమాచారము ప్రకారము, “శుక్రవారము నాడు ఖైబర్ పాఖ్తున్ఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరములో పోలీసులు లక్ష్యంగా జరిగిన బాంబు పేలుడులో 6 మంది చనిపోయారు మరియు ప్రాథమిక దర్యాప్తు ప్రకారము విస్ఫోటకాలతో ప్యాక్ చేయబడిన మోటార్ సైకిల్ పేలుడులో ఉపయోగించబడిందని పోలీసు అధికారులు తెలిపారు. పేలుడులో చనిపోయిన వారి వయసు 15 మరియు 20 సంవత్సరాల మధ్య ఉంటుంది”.

అలి వజీర్, పాకిస్తాన్ యొక్క దక్షిణ వజీరిస్తాన్ నాయకుడు కొన్ని చిత్రాలను మరియు ప్రజలు గాయపడిన పేలుడు యొక్క వైరల్ వీడియోను తన X (ట్విట్టర్) హ్యాండిల్ పై షేర్ చేశారు. మా దర్యాప్తును కొనసాగిస్తూ, మేము తీవ్రవాది మసూద్ అజ్హర్ యొక్క మరణము వెనుక ఉన్న వాస్తవాన్ని కనుగొనే ప్రయత్నం చేశాము. మా సెర్చ్ సమయములో, దీనిని ధృవీకరిస్తూ మాకు ఎలాంటి విశ్వసనీయమైన వార్త లేదా అధికారిక ప్రకటన లభించలేదు.

వైరల్ వీడియోలోని క్లెయిమ్స్ ను ధృవీకరించుటకు మేము పాకిస్తాని విలేఖరి అదిల్ అలీని సంప్రదించాము. క్లెయిమ్స్ ను ఖండిస్తూ ఆయన ఇలా అన్నారు, “ఈ వీడియో పాతది” నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ యొక్క సోషల్ స్కానింగ్ లో ఈ యూజర్ కు 1,900 ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.

ముగింపు: వైరల్ అవుతున్న వీడియో, ఖైబర్ పాఖ్తున్ఖ్వా, పాకిస్తాన్ లో జరిగిన ఒక పేలుడుకు సంబంధించినది అని, ఇటీవల జరిగిన సంఘటన కాదని, తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఇదే కాకుండా, తీవ్రవాది మౌలానా మసూద్ అజ్హర్ యొక్క మరణము గురించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later