ఈ సంఘటన జూన్ 2022లో జరిగిందని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. కెప్టెన్ మోనికా ఖన్నా పాట్నా-ఢిల్లీ విమానములోజరిగిన అగ్నిప్రమాద పరిస్థితిలో బాధ్యతగా వ్యవహరించింది, కాని ఈ పాత వార్త ఇటీవల జరిగినదిగా తప్పుగా చూపించబడింది.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఇటీవల పాట్నా-ఢిల్లీ విమానము అగ్నిప్రమాదానికి గురి అయ్యిందని మరియు కెప్టెన్ మోనికా ఖన్నా ఒకే ఇంజన్ పై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడము ద్వారా 191 ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిందనే క్లెయిమ్ తో మహిళా పైలట్ యొక్క చిత్రము ఒకటి సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఈ వార్త ఇటీవలి సంఘటనగా షేర్ చేయబడుతోంది.
ఈ సంఘటన జూన్ 2022లో జరిగిందని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. కెప్టెన్ మోనికా ఖన్నా పాట్నా-ఢిల్లీ విమానములోజరిగిన అగ్నిప్రమాద పరిస్థితిలో బాధ్యతగా వ్యవహరించింది, కాని ఈ పాత వార్త ఇటీవల జరిగినదిగా తప్పుగా చూపించబడింది.
ఈ విధమైన శీర్షికతో ఒక ఫేస్బుక్ యూజర్ వైరల్ పోస్ట్ ను షేర్ చేశారు, “పాట్నా-ఢిల్లీ విమానములో అగ్నిప్రమాదము జరిగినప్పుడు, కెప్టెన్ మోనికా ఖన్నా ఒకే ఇంజన్ పై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడము ద్వారా వీరోచితంగా 191 మంది ప్రయాణీకుల ప్రాణాలను కాపాడారు. భారతమాత గర్వించదగిన వీరనారిని చూసి మేము గర్విస్తున్నాము.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.
మా దర్యాప్తును ప్రారంభిస్తూ, మేము ముందుగా కీవర్డ్స్ ఉపయోగించి సంబంధిత వార్త కొరకు సెర్చ్ చేశాము. మాకు అమర్ ఉజాలా వెబ్సైట్ పై జూన్ 20, 2022 నాడు ప్రచురించబడిన ఇటువంటి ఒక రిపోర్ట్ లభించింది. ఈ వార్తలో పాట్నాలో స్పైస్జెట్ విమానములోని ఇంజన్లలో ఒకదానిని ఒక పక్షి ఢీ కొట్టగా మంటలు అంటుకున్నప్పుడు పాట్నా విమానాశ్రయములో కెప్టెన్ మోనికా ఖన్నా ఏ విధంగా సిబ్బందితో కలుపుకొని 191 మంది ప్రాణాలు కాపాడింది అనేది వివరించబడింది. \కెప్టెన్ ఖన్నా, ఫ్లైట్ ఎస్జి 723 యొక్క పైలట్ ఇన్ కమాండ్ (పిఐసి) మంటలు అంటుకున్న ఇంజన్ ను వెంటనే ఆఫ్ చేసి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది.
అంతేకాకుండా, కెప్టెన్ మోనికా ఖన్నా పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయము నుండి ఢిల్లీ ఐజిఐ విమానాశ్రయానికి స్పైస్జెట్ బోయింగ్ 737 విమానములో 185 మంది ప్రయాణీకులతో బయలుదేరింది అని జూన్ 20, 2022 నాడు న్యూస్ 18 రిపోర్ట్ చేసింది . విమానము బయలుదేరిన కొద్దిసేపటికి, ఒక పక్షి ఢీ కొట్టడముతో ఇంజన్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయి. పొగ వలన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటిసి) ద్వారా హెచ్చరించబడిన తరువాత, కెప్టెన్ ఖన్నా ప్రభావిత ఇంజన్ ను వెంటనే షట్ డౌన్ చేసి, తిరిగి పాట్నా విమానాశ్రయములో ఒకే ఒక్క ఇంజన్ పై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రామాణిక విధానాన్ని అనుసరించింది.
ఈ సంఘటన గురించి దైనిక్ జాగరణ్ మరియు ఇతర వెబ్సైట్స్ పై జూన్ 20, 2022 నాడు కూడా ప్రచురించబడింది. వైరల్ పోస్ట్ ను ధృవీకరించుటకు మేము అమిత్ ఆలోక్, దైనిక్ జాగరణ్ జిల్లా ఇన్-చార్జ్ ను పాట్నాలో కలిశాము. ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రితం పాట్నా విమానాశ్రయములో జరిగిందని ఆయన ధృవీకరించారు.
తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ గురించిన మా సోషల్ మీడియా స్కాన్ లో అతనికి 27000 మంది ఫాలోయర్స్ ఉన్నారని వెల్లడి అయ్యింది.
ముగింపు: వైరల్ వార్త జూన్ 2022 కు సంబంధించినది అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వెల్లడి అయ్యింది. పాట్నా-ఢిల్లీ విమానములో అగ్నిప్రమాదము జరిగిన తరువాత కెప్టెన్ మోనికా ఖన్నా సురక్షితంగా చేసిన అత్యవసర ల్యాండింగ్ గురించిన వార్త పాతది మరియు అది ఇటీవల జరిగిన సంఘటన అనే తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వ్యాప్తి చేయబడుతోంది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923