X
X

Fact Check: తెలగాణ సచివాలయములో కేవలం మసీదు మాత్రమే కాదు, మందిరము మరియు చర్చ్ కూడా ప్రారంభించబడ్డాయి

  • By: Abhishek Parashar
  • Published: Sep 30, 2023 at 10:56 AM
  • Updated: Sep 30, 2023 at 03:43 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్)। సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇది తెలంగాణ సచివాలయములో కొత్తగా నిర్మించబడిన మసీదు ప్రారంభోత్సవ సందర్భములోని వీడియో అని ఇందులో క్లెయిమ్ చేయబడింది. పోస్ట్ ను షేర్ చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ముస్లింలను శాంతింపజేయుటకు సచివాలయ భవనములో కేవలం మసీదును మాత్రమే ప్రారంభింఛారు అని క్లెయిమ్ చేయబడుతోంది.

తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ సాంప్రదాయిక రంగు పులిమి షేర్ చేయబడుతున్న ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కొత్తగా నిర్మించబడిన సచివాలయ ప్రాంగణాన్ని ప్రారంభించారు, ఇందులో ఒక మందిరము, మసీదు మరియు చర్చ్ మూడు ఉన్నాయి మరియు ముఖ్యమంత్రి ఈ మూడింటిని ప్రారంభించారు. ఈ సందర్భములో మూడు మతపరమైన ప్రదేశాలలో తెలంగాణ గవర్నర్ తమిళసై సుందరరాజన్ మరియు ముఖ్యమంత్రి సమక్షములో విశేష ప్రార్థనలు కూడా జరిగాయి.

ఏది వైరల్ అవుతోంది?

వైరల్ వీడియోను (ఆర్కైవ్ లింక్) షేర్ చేస్తూ సోషల్ మీడియా యూజర్ ‘శ్యామ్‎దాస్ సాధు’ ఇలా వ్రాశారు, “తెలంగాణ సచివాలయములో కొత్తగా నిర్మించబడిన మసీదును ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభించారు. హిందూ ముస్లిములను శాంతింపజేసే స్వార్థ రాజకీయ పార్టీలకు వోటు వేస్తే, ఇటువంటి సంఘటనలే చూస్తారు.”

చాలామంది ఇతర యూజర్స్ ఈ వీడియోను ఇటువంటి క్లెయిమ్స్ తో షేర్ చేశారు. ఇదివరకు కూడా చాలామంది యూజర్స్ ఈ వీడియోను ఇలాంటి క్లెయిమ్ తో షేర్ చేశారు.

@ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుగారు తెలంగాణ సచివాలయములో కొత్తగా నిర్మించబడిన మసీదు యొక్క ప్రారంభోత్సవం చేశారు. #స్వార్థ_హిందువులు #ముస్లిములను శాంతింపజేసే రాజకీయ పార్టీలకు వోటు వేస్తే ఇదే చూడాలి. pic.twitter.com/eKm6jLAu7S

దర్యాప్తు

వైరల్ వీడియోను షేర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వము కొత్త సచివాలయం పరిసరాలలో కేవలం మసీదును మాత్రమే ప్రారంభించింది అని క్లెయిమ్ చేయబడింది. దీని ప్రస్తావన లభించిన అనేక రిపోర్ట్స్ మాకు న్యూస్ సెర్చ్ లో లభించాయి.

జాగరణ్ డాట్.కామ్ యొక్క ఆగస్ట్ 26, 2023 రిపోర్ట్ ప్రకారం, “తెలంగాణ యొక్క కొత్త సచివాలయములో సిఎం కేసిఆర్ మందిరము, మసీదు మరియు చర్చ్ యొక్క ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవములో చాలామంది మంత్రులు మరియు అధికారులు హాజరు అయ్యారు. తెలంగాణాలో సోదరభావాన్ని నిలిపి ఉంచేందుకు ప్రభుత్వ నిబద్ధతను చాటుకున్నారు అని మసీదులో తన ప్రసంగములో ముఖ్యమంత్రి వ్యక్తపరచారు. దేశములో ఐక్యత మరియు సోదరభావానికి తెలంగాణ సచివాలయం ప్రతీకగా నిలిచింది, ఎందుకంటే ఈ పరిసరాలలో ఒక మందిరము, చర్చ్ మరియు మసీదు ఉన్నాయి.”

ఇండియా టుడే రిపోర్ట్ లో కూడా దీని ప్రస్తావన జరిగింది

వైరల్ వీడియోలో ఏఐఎంఐఎం యొక్క ప్రెసిడెంట్ మరియు హైదరాబాదు నుండి లోక్‎సభ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ మరియు ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ (విధానసభలో పార్టీ నేత) కూడా చూడవచ్చు. NDTV యొక్క రిపోర్ట్ ప్రకారము “తెలంగాణా యొక్క కొత్త సచివాలయ భవనములో మందిరము, మసీదు మరియు చర్చ్ ప్రారంభించబడ్డాయి మరియు ఈ సందర్భంగా ఈ మూడు మతపరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ప్రార్థనలలో గవర్నర్ తమిళసై సుందరరాజన్ మరియు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.” రిపోర్ట్ ప్రకారం, చాలామంది మంత్రులు మరియు అధికారులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. అక్కడే, ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ మరియు హైదరాబాదు నుండి లోక్‎సభ ఎంపి అససుద్దీన్ ఒవైసీ మరియు విధానసభలో పార్టీ నేత మరియు ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ మసీదు ప్రారంభోత్సవములో పాల్గొన్నారు.

వేరు వేరు వీడియోలలో ముఖ్యమంత్రి మందిరము, మసీదు మరియు చర్చ్ ల ప్రారంభిస్తూ చూడవచ్చు.

టీ న్యూస్ తెలుగు యొక్క అధికారిక యూ-ట్యూబ్ ఛానల్ లో ఉన్న ఒక వీడియో బులెటిన్ లో మసీదు ప్రారంభోత్స వేడుకలో గవర్నర్ మరియు ముఖ్యమంత్రితో పాటు ఒవైసీ సోదరులు కూడా కూర్చొని ఉండడం చూడవచ్చు.

మాకు మరొక వీడియో లభించింది, ఇందులో నిర్మాణంలో ఉన్న మసీదు భవనాన్ని పరిశీలించిన అక్బరుద్దీన్ ఒవైసీని చూడవచ్చు మరియు ఇందులో కనిపించే భవనం, వైరల్ వీడియోలో కనిపించే భవనం ఒక్కటే.

అలాగే ఇందులో ఒవైసీ ఇచ్చిన ప్రసంగిస్తున్న క్లిప్ కూడా చూడవచ్చు. ఇదే వైరల్ వీడియో క్లిప్ లో కూడా ఉంది. తెలంగాణ యొక్క కొత్త సచివాలయ భవనములో కేవలం మసీదు మాత్రమే ప్రారంభించబడింది అనే క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని మా దర్యాప్తులో స్పష్టం అయ్యింది. ముఖ్యమంత్రి కేసిఆర్ కొత్తగా నిర్మితమైన భవనములో మందిరము, మసీదు మరియు చర్చ్, మూడింటిని ప్రారంభించారు.

వైరల్ వీడియో క్లిప్ కు సంబంధించి మేము హైదరాబాదు యొక్క స్థానిక టివి విలేఖరి నూర్ మొహమ్మద్ ను సంప్రదించాము. ఆయన “కొత్తగా నిర్మించిన సచివాలయ భవనములో మందిరము, మసీదు మరియు చర్చ్, మూడు ఉన్నాయి మరియు మూడింటి ప్రారంభోత్సవం ఒకేసారి జరిగింది” అని నిర్ధారించారు.

వైరల్ వీడియో క్లిప్ తప్పుదోవపట్టించేది మరియు సాంప్రదాయిక క్లెయిమ్ తో షేర్ చేసిన యూజర్ కు ఫేస్‎బుక్ లో రెండు వందల కంటే ఎక్కువగా ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: హైదరాబాదులో కొత్తగా నిర్మించబడిన సచివాలయము ప్రాంగణములో కేవలం మసీదు ప్రారంభోత్సవం మాత్రమే జరిగింది అనేది తప్పు, దీనిని సాంప్రదాయిక క్లెయిమ్ తో షేర్ చేయబడుతోంది. కొత్తగా నిర్మితమైన సచివాలయములో మందిరము, మసీదు మరియు చర్చ్, మూడు ఉన్నాయి మరియు గవర్నర్ మరియు ఇతర మంత్రుల సమక్షములో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ మూడింటిని ఒకేసారి ప్రారంభించారు.

  • Claim Review : తెలంగాణలో కొత్తగా నిర్మించబడిన సచివాలయ భవనములో ముఖ్యమంత్రి కేవలం మసీదును మాత్రమే ప్రారంభించారు.
  • Claimed By :  ఎఫ్‎బి యూజర్- శ్యామ్‎దాస్ సాధు
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later