X
X

Fact Check: ప్రశాంత్ కిశోర్ బిజేపిలో చేరాడు అని క్లెయిమ్ చేసే లేఖ తప్పుదోవపట్టించేది; ఆ దస్తావేజు నకిలీది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ప్రశాంత్ కిశోర్ పార్టీ యొక్క జాతీయ ప్రధాన ప్రతినిధిగా నియమించబడ్డారని తప్పుగా క్లెయిమ్ చేస్తూ, బిజేపి లెటర్‎హెడ్ నుండి ఉద్దేశపూర్వకంగా వైరల్ చేయబడిన ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతూ ఉంది.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. ప్రశాంత్ కిశోర్ మరియు బిజేపి జాతీయ సమన్వయకర్త అరుణ్ సింగ్, ఇద్దరు ఈ లేఖ నకిలీది అని ధృవీకరించారు.

ఏది వైరల్ అవుతోంది?

మే 22, 2024 నాడు ఇన్స్టాగ్రాం యూజర్ జార్ఖండ్.ముక్తి.మోర్ఛా.ఫాన్ ఈ వైరల్ లేఖను “పికే బిజేపి జట్టుకు చెందినవారు అయ్యారు, అందుకే మోడీ గారు గెలిచేవారు!!!”

వైరల్ లేఖలో ఈ విధంగా పేర్కొనబడింది, “సంస్థాగత నియామకము. శ్రీ ప్రశాంత్ కిశోర్ ను బిజేపి యొక్క జాతీయ ప్రధాన ప్రతినిధిగా బిజేపి జాతీయ ప్రెసిడెంట్ శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా నియమించారు. ఈ నియామకము వెంటనే అమలులోకి వస్తుంది.” ఈ లేఖపై బిజేపి జాతీయ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ సంతకం చేశారు. ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు

వైరల్ లేఖ యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ సెర్చ్ నిర్వహించాము కాని ప్రశాంత్ కిశోర్ బిజేపిలో చేరినట్లు తెలిపే వార్త మాకు ఎక్కడ కనిపించలేదు.

మేము బిజేపి మరియు ప్రశాంత్ కిశోర్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా పరీక్షించాము కాని సంబంధిత సమాచారము ఏది లేదు.

లేఖపై బిజేపి జాతీయ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ సంతకం చేశారు అని ఆరోపించబడిన నేపథ్యములో, మేము ఆ వైరల్ క్లెయిమ్ యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు ఆయనను కలిశాము ఆయన ఇలా పేర్కొన్నారు, “వైరల్ లేఖ ఎడిట్ చేయబడింది మరియు ఈ పోస్ట్ పూర్తిగా నిరాధారమైనది.”

అదనంగా, మేము ప్రశాంత్ కిశోర్ ను కూడా కలిశాము, ఆయన ఈ పోస్ట్ నకిలీది అని ధృవీకరించారు. అలాగే ఆయన జన్ సూరజ్ ద్వారా చేయబడిన ఒక ట్వీట్ ను మాకు షేర్ చేశారు, ఇందులో పేర్కొనబడిన ఈ లేఖను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వేరెవరికో పంపుటున్నట్లు తెలిపే ఒక వాట్సాప్ చాట్ యొక్క స్క్రీన్ షాట్ కూడా ఉంది. నకిలీ లేఖతో తప్పు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఈ ట్వీట్ కాంగ్రెస్ పై ఆరోపణ చేసింది.

(విశ్వాస్ న్యూస్ స్వతంత్రంగా వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ యొక్క ఖచ్ఛితత్వాన్ని ధృవీకరించదు.) 

మే 21, 2024 నాడు NDTV తో ఒక ఇంటర్వ్యూలో, ప్రశాంత్ కిశోర్ బిజేపి యొక్క విజయాన్ని అంచనావేశారు. 2014 ఎన్నికల సమయములో ప్రశాంత్ కిశోర్ బిజేపితో కలిసి పనిచేశారు అని గమనించదగినది.

మేము అసత్యపు క్లెయిమ్ ను షేర్ చేసిన యూజర్ యొక్క జార్ఖండ్.ముక్తి.మోర్చా.ఫాన్ సోషల్ మీడియా అకౌంట్ ను సమీక్షించాము మరియు దీనిని కేవలం 100 మంది ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.

ముగింపు: ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని ప్రశాంత్ కిశోర్ బిజేపిలో చేరలేదని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు ధృవీకరించింది. ప్రశాంత్ కిశోర్ మరియు బిజేపి జాతీయ సమన్వయకర్త అరుణ్ సింగ్, ఇద్దరు ఈ లేఖ నకిలీది అని విశ్వాస్ న్యూస్ కు ధృవీకరించారు.

  • Claim Review : ప్రశాంత్ కిశోర్ బిజేపి యొక్క జాతీయ ప్రధాన ప్రతినిధిగా నియమించబడ్డారు.
  • Claimed By : ఇన్స్టాగ్రాం యూజర్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later