X
X

Fact Check: వైరల్ ఫోటోలో ఉన్నది అభిషేక్ మను సింఘ్వి ఇల్లు, మనీష్ సిసోడియా ఇల్లు కాదు

విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసింది మరియు ఇది నకిలీది అని కనుగొనింది. చిత్రములో చూపించబడినది అభిషేక్ మను సింఘ్వి ఇల్లు, మనీష్ సిసోడియా ఇల్లు కాదు.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). కాంగ్రె నేత మరియు సుప్రీం కోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అతని కేసుకు ప్రాతినిథ్యం వహించగా మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఆగస్ట్ 9, 2024 నాడు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 17 నెలలు జైలులో గడిపిన తరువాత, సిసోడియా వార్తలలో ఉన్నారు మరియు ఆయన కుటుంబముతో ఉన్న చాలా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. వీటిల్లో, ఒక చిత్రము సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఎయిర్ ప్యూరిఫైయ్యర్ మరియు కొన్ని చిత్రలేఖనాలు బ్యాక్‎గ్రౌండ్ లో ఉండగా, సిసోడియా మరియు సింఘ్వి కలిసి ఉన్నారు. ఈ చిత్రము సిసోడియా ఇంటికి సంబంధించినది అని అసత్యంగా క్లెయిమ్ చేయబడుతోంది.

విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసింది మరియు ఇది నకిలీది అని కనుగొనింది. చిత్రములో చూపించబడినది అభిషేక్ మను సింఘ్వి ఇల్లు, మనీష్ సిసోడియా ఇల్లు కాదు.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఆగస్ట్ 11, 2024 నాడు ఫేస్‎బుక్ యూజర్  అమిత్ గౌతం పబ్లిక్ గ్రూప్ విశ్వగురు భారత్‎వర్ష్ పై ఒక వైరల్ చిత్రాన్ని షేర్ చేస్తూ, ఈ శీర్షికను వ్రాశారు, “ఆమ్ ఆద్మి పార్టి నేత మనీష్ సిసోడియా తన ఇంట్లో ఖరీదైన డైసన్ ఎయిర్ ప్యూరిఫైయ్యర్ (50 వేలు) తో పరిశుభ్రమైన గాలిని ఆనందిస్తున్నారు, కాగా ‘సామాన్యుడు బయట ఉన్న కాలుష్యము కారణంగా ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పన్నుదారుడి డబ్బుతో అత్యధిక న్యాయస్థాన ఖర్చులను చెల్లించిన తరువాత బెయిల్ పొందిన ఆయన తన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో ఆనందిస్తున్నారు. అంతేకాకుండా, వెనుక గోడ మీద ఉన్న ఫోటోను చూడండి – అది ఆయన అభిరుచిని కూడా వెల్లడిస్తుంది”.

దర్యాప్తు

ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేయుటకు, మేము గూగుల్ లెన్స్ ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము మరియు ఈ చిత్రాన్ని అనేక వార్తా నివేదికలలో కనుగొన్నాము.

ముఖ్యంగా, ఈ చిత్రము ఆగస్ట్ 10, 2024 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో కూడా కనిపించింది. ఈ నివేదిక ప్రకారం, “ఆమ్ ఆద్మి పార్టి (ఏఏపి) నేత మనీష్ సిసోడియా ఎక్సైస్ పాలసీ కేసులో సుప్రీం కోర్టు నుండి బెయిల్ వచ్చేందుకు ఆయన చేసిన సహాయానికి ధన్యవాదములు చెప్పాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ఆయన నివాసములో శనివారమునాడు కలిశారు.”

ఆగస్ట్ 10, 2024 తేది దైనిక్ జాగరణ్ రిపోర్ట్  లో మాకు ఈ సమావేశానికి సంబంధించిన మరికొన్ని చిత్రాలు కూడా కనిపించాయి. రిపోర్ట్ ఇలా పేర్కొనింది, “సీనియర్ ఏఏపి నేత మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం రోజు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ఆయన నివాసములో కలిశారు. సిసోడియా ఆయనకు తన కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ ఏఏపి నేతలు సంజయ్ సింగ్ మరియు అతీషి కూడా అక్కడ ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వి కేజ్రివాల్ మరియు సిసోడియాలకు ప్రాతినిథ్యం వహించారు మరియు సిసోడియాకు బెయిల్ తీసుకొని రావడములో ముఖ్య పాత్ర పోషించారు.”

మేము ఏఏపి నేత సౌరభ్ భరద్వాజ్ ను సంప్రదించాము, ఆయన ఈ చిత్రము అభిషేక్ మను సింఘ్వి ఇంటిదని, మనీష్ సిసోడియాది కాదని ధృవీకరించారు.

మనీ లాండరింగ్ అభియోగాలపై 17 నెలలు జైల్లో ఉన్న మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఆగస్ట్ 9, 2024 నాడు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఫిబ్రవరి 26, 2023 నుండి కస్టడీలో ఉన్నారు.

ఈ పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ గ్రూప్ ‘విశ్వగురు భారత్‎వర్ష్’ కు 9000 పైగా సభ్యులు ఉన్నారు మరియు ఎనిమిది సంవత్సరాల క్రితం సృష్టించబడింది.

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యమని కనుగొనబడింది. చిత్రములో ఉన్నది కాంగ్రెస్ నేత మరియు సుప్రీం కోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఇల్లు, ఏఏపి నేత మనీష్ సిసోడియాఇద్ కాదు.

  • Claim Review : వైరల్ ఫోటో  మనీష్ సిసోడియా ఇంటిని చూపుతుంది
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later