వాస్తవ తనిఖీ: మొఘల్ గార్డెన్స్‌కు అశోక్ వాటికగా పేరు మార్చలేదు, వైరల్ అవుతున్న పోస్ట్‌ అబద్ధం

రాష్ట్రపతి భవన్‌కు చెందిన మొఘల్ గార్డెన్స్ పేరును ‘అశోక వాటిక’ అని పేరు మార్చుతున్నారన్న ప్రచారం అబద్ధం. గతంలో కూడా, మొఘల్ గార్డెన్ పేరును రాజేంద్ర ప్రసాద్ గార్డెన్‌గా మారుస్తున్నారంటూ ఓ పుకారు వైరల్‌ అయ్యింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ ప్రచారం తప్పు అని నిరూపించబడింది.

వాస్తవ తనిఖీ: మొఘల్ గార్డెన్స్‌కు అశోక్ వాటికగా పేరు మార్చలేదు, వైరల్ అవుతున్న పోస్ట్‌ అబద్ధం

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా అనేక వైరల్ పోస్టులు తిరుగుతున్నాయి. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని మొఘల్ గార్డెన్ పేరు మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ పుకార్లు వ్యాపించాయి. మొఘల్ గార్డెన్స్ పేరును ‘అశోక్ వాటిక’గా మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.

విశ్వాస్ న్యూస్‌ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని మరియు ‘రాజేంద్ర ప్రసాద్ గార్డెన్’ పేరు మార్చడం వంటి ప్రచారం కూడా గతంలో జరిగినట్లు ఇంటర్నెట్‌లో ఉన్నాయని తేలింది.

దావా :
ఫేస్‌బుక్ యూజర్ ‘బర్హరియా సివాన్‌’ తన పోస్ట్‌లో ఇలా రాశారు, ‘మొఘల్ గార్డెన్ పేరును అశోక్ వాటికగా మార్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మేము గంటను పట్టించుకోవడం లేదు. ‘

ఇంకా చాలామంది యూజర్లు.. ఈ ఫోటోలను ఉపయోగించి ఇలాంటి ప్రచారమే చేశారు.
ఈ పోస్ట్‌కు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడండి.

దర్యాప్తు :
రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని మొఘల్ గార్డెన్స్ చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దాని పేరులో మార్పు అంటే అది పెద్ద వార్త అవుతుంది. కానీ వార్తల శోధనలో మాకు అలాంటి సమాచారం ఎక్కడా కనిపించలేదు.

ఇతర కీలక పదాలతో శోధిస్తున్నప్పుడు, మేము కొన్ని పాత వార్తలకు సంబంధించిన లింక్‌ను చూశాము, దీని ప్రకారం అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరును ‘రాజేంద్ర ప్రసాద్ గార్డెన్‌’ గా మార్చాలని డిమాండ్ చేసింది. 20 ఆగస్టు 2017 న ఎన్‌బిటి వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం.. ఈ డిమాండ్‌తో హిందూ మహాసభ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలకు లేఖ రాసినట్లు ఉంది.

విశ్వాస్ న్యూస్ రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ సింగ్‌ను సంప్రదించింది. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వాదనలు పుకార్లు మాత్రమే అని మాకు ప్రెస్ సెక్రటరీ కార్యాలయం ద్వారా సమాచారం అందింది. ‘మేము ఎటువంటి పుకార్లపై వ్యాఖ్యానించలేము. దీని గురించి ఏదైనా సమాచారం కావాలంటే, రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.’ అని అన్నారు.

ఆ తర్వాత మేము రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్‌కు వెళ్లి పరిశీలించడం జరిగింది. ప్రధాన భవనం రాష్ట్రపతి భవన్ యొక్క సర్క్యూట్ 1 లో ఉంది, మ్యూజియం సర్క్యూట్ 2 లో ఉంది. అదే సమయంలో, మొఘల్ గార్డెన్స్ సహా సర్క్యూట్ 3 లో చాలా తోటలు ఉన్నాయి. ఇక్కడ కూడా మొఘల్ గార్డెన్స్ పేరు మార్పు గురించి మాకు సమాచారం కనిపించలేదు.

కేంద్ర ప్రభుత్వ నోడల్ కమ్యూనికేషన్ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇవి నకిలీ వాదనలు అంటూ ఖండించింది మరియు “రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరులో ఎటువంటి మార్పు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు” అని పేర్కొంది.

ఫేస్‌బుక్‌లో ఈ వైరల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిన పేజీకి లక్ష మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ పేజీ అక్టోబర్ 2012 నుండి ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంది.

निष्कर्ष: రాష్ట్రపతి భవన్‌కు చెందిన మొఘల్ గార్డెన్స్ పేరును ‘అశోక వాటిక’ అని పేరు మార్చుతున్నారన్న ప్రచారం అబద్ధం. గతంలో కూడా, మొఘల్ గార్డెన్ పేరును రాజేంద్ర ప్రసాద్ గార్డెన్‌గా మారుస్తున్నారంటూ ఓ పుకారు వైరల్‌ అయ్యింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ ప్రచారం తప్పు అని నిరూపించబడింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు