X
X

వాస్తవ తనిఖీ: ప్రధానమంత్రి మోడీ మరియు ఆయన తల్లి పేరున వైరల్ అవుతున్న చిత్రానికి వారికి ఎలాంటి సంబంధం లేదు

ప్రధాని మోడీ మరియు ఆయన తల్లిగారి పేరున వైరల్ అయిన ఈ పోస్ట్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో రుజువు అయ్యింది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాపై వైరల్ అవుతున్న ఒక చిత్రములో ఒక మహిళ తన బిడ్డతో కూర్చొని ఉన్నట్లు చూపుతోంది. క్లెయిమ్ ప్రకారం అది ప్రధానమంత్రి నరేంద్ర మోడి మరియు ఆయన తల్లి హీరాబేన్ గారిది. విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు జరిపింది. ఇదే చిత్రము మన దేశపు మాజీ రాష్ట్రపతి డా. ఏపిజే అబ్దుల్ కలాం గారి పేరున కూడా వైరల్ అయ్యింది. విశ్వాస్ న్యూస్ వారు ప్రధాని మోడీ గారి సోదరుడిని సంప్రదించినప్పుడు ఈ వైరల్ పోస్ట్ నకిలీది అని ఆయన తెలిపారు.

క్లెయిమ్

ఫేస్‎బుక్ యూజర్ అర్జున్ లాల్ తన ఖాతాలో జనవరి 11న ఒక చిత్రాన్ని అప్లోడ్ చేశారు. ఆ చిత్రములో 132 కోట్లమందిని కదిలించిన ఒక బిడ్డ అని వ్రాయబడింది. తన తల్లి హీరాబేన్ తో ఉన్న నరేంద్రమోడి.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

ప్రధానమంత్రి మోడీ మరియు ఆయన తల్లి పేరున ఉన్న ఈ వైరల్ చిత్రములోని వాస్తవాలను కనుగొనేందుకు విశ్వాస్ న్యూస్ వారు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించింది. చిత్రాన్ని సెర్చ్ చేసినప్పుడు, దేశపు మాజీ రాష్ట్రపతి అబుద్ల్ కలాం ఆజాద్ పేరున క్లెయిమ్ తో ఉన్న ఈ చిత్రము ఇంటర్నెట్ పై చాలా రిపోర్ట్స్ లో ఉందని మేము కనుగొన్నాము.

దర్యాప్తు సమయములో, మేము మర్యాల శ్రీనివాస్ అనే ఒక ఫేస్‎బుక్ యూజర్ యొక్క ఖాతాలో దీని అసలైన చిత్రాన్ని కూడా కనుగొన్నాము. దీనిని అప్లోడ్ చేసే సమయములో, యూజర్ ఈ చిత్రము తన కుటుంబానికి చెందినది అని పేర్కొన్నారు. కొన్నిసార్లు అది నరేంద్ర మోడీగారి పేరున మరియు మరికొన్నిసార్లు అబ్దుల్ కలాం గారి పేరున వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ ను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ చిత్రాన్ని యూజర్ 2011లో ఫేస్‎బుక్ పై పోస్ట్ చేశారు. దీనిని పోస్ట్ చేసే సమయములో చిత్రములో ఉన్నది తన కుటుంబము అని – తండ్రి, చెల్లి, నేను, సోదరుడు మరియు తల్లి అని స్పష్టంగా వ్రాయబడింది. ఈ పోస్ట్ ను ఈ దిగువన ఇక్కడ క్లిక్ చేయడము ద్వారా చూడవచ్చు.

విశ్వాస్ న్యూస్ వారు ప్రధాని మోడీ గారి సోదరుడు ప్రహ్లాద్ మోడి గారిని సంప్రదించారు మరియు ఈ వైరల్ చిత్రాన్ని అతనికి షేర్ చేశారు. ఈ వైరల్ పోస్ట్ నకిలీది అని, ఆ చిత్రములో తన తల్లి లేదని ఆయన చెప్పారు

విశ్వాస్ న్యూస్ వైరల్ చిత్రాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేదు, కాని ఈ చిత్రము ప్రధాని మోడి మరియు ఆయన తల్లిగారికి సంబంధించినది కాదు అని ధృవీకరించబడింది.

విశ్వాస్ న్యూస్ ఈ నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేసింది. ఫేస్‎బుక్ యూజర్ అర్జున్ లాల్ యొక్క సోషల్ స్కానింగ్ ద్వారా ఆయన నవాల్‎ఘడ్, రాజస్థాన్ నివాసి అని మరియు ప్రస్తుతం ఆయన బెహ్రెయిన్ లో ఉన్నారని వెల్లడి అయ్యింది.

निष्कर्ष: ప్రధాని మోడీ మరియు ఆయన తల్లిగారి పేరున వైరల్ అయిన ఈ పోస్ట్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో రుజువు అయ్యింది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later