X
X

వాస్తవ తనిఖీ: వాట్సాప్ గ్రూప్ పై నమాజ్ చేయడము గురించి రంజన్ గోగోయ్ ట్వీట్ చేయలేదు. వైరల్ పోస్ట్ నకిలీది.

ముగింపు: విశ్వాస్ న్యూస్ తన విచారణలో ఈ ట్వీట్ నకిలీది అని కనుగొనింది. రంజన్ గోగోయ్ ఇటువంటి ట్వీట్ ఏదీ చేయలేదు.

  • By: Umam Noor
  • Published: Aug 31, 2021 at 11:17 AM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): యూజర్లు సోషల్ మీడియాపై ఒక ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ ను విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి మరియు ఇప్పటి రాజ్యసభ ఎంపి రంజన్ గోగోయ్ పేరున షేర్ చేస్తున్నారు. స్క్రీన్ షాట్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ లో రంజన్ గోగోయ్ యొక్క ఫోటో కూడా ఉంది మరియు ఆ ట్వీట్ లో ముస్లిమ్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రార్థనలు చేయాలని అడుగుతోంది. ఈ ట్వీట్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ తన విచారణలో కనుగొనింది. రంజన్ గోగోయ్ ఇటువంటి ట్వీట్ ఏది చేయలేదు.

వైరల్ పోస్ట్ లో ఏమి ఉంది?

ఫేస్‎బుక్ యూజర్ ఎస్ కే ఖుంట్వాల్ ఒక వైరల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. ఇందులో ఇలా వ్రాసి ఉంది, “మీరు ఫోన్ పై విడాకులు ఇవ్వగలిగితే, మీరు వాట్సాప్ గ్రూప్ లో నమాజ్ ఎందుకు చదవకూడదు”.

విచారణ

మా విచారణను ప్రారంభిస్తూ మేము ముందు ఈ ట్వీట్ ను రంజన్ గోగోయ్ పేరున ట్విట్టర్ లో వెతకడం ప్రారంభించాము. మా శోధనలో, రంజన్ గోగోయ్ చేసిన ఇటువంటి అధికారిక ట్వీట్ ఏదీ మాకు కనిపించలేదు. ఇప్పుడు మేము వైరల్ స్క్రీన్ షాట్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ను శోధించడం ప్రారంభించాము ట్విట్టర్ పై @SGBJP. మరియు ఈ పేరున మాకు ఒక  సస్పెండ్ చేయబడిన ఖాతా లభించింది. అంటే ఈ నకిలీ ఖాతాను ట్విట్టర్ ఇదివరకే సస్పెండ్ చేసింది.

మా విచారణను కొనసాగిస్తూ మేము, గూగుల్ న్యూస్ సెర్చ్ సహాయం తీసుకున్నాము మరియు రంజన్ గోగోయ్ వైరల్ ట్వీట్ వంటి వ్యాఖ్య ఏదైనా చేశారా అని తెలుసుకునే ప్రయత్నం చేశాము. మా శోధనలో ఈ క్లెయింను ధృవీకరించే ఇటువంటి వ్యాసం ఏది లభించలేదు. ఒకవేళ రంజన్ గోగోయ్ నిజంగా ఇటువంటి వివాదాస్పదమైన ట్వీట్ లేదా వ్యాఖ్య చేసి ఉంటే, అది వార్తలలో పేర్కొనబడి ఉండేది

ఇప్పుడు మేము వైరల్ స్క్రీన్ షాట్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా శోధించాము. ఆ శోధనలో మాకు ఈ స్క్రీన్ షాట్ వేరే విశ్వసనీయమైన వార్తా వెబ్సైట్స్ పై కూడా లభించలేదు.

విశ్వాస్ న్యూస్ దైనిక్ జాగరణ్ యొక్క ప్రత్యేక కరెస్పాండెంట్ అయిన మాలా దీక్షిత్ ను ఈ వైరల్ పోస్ట్ ను ధృవీకరించుట కొరకు సంప్రదించాము. ఆమె ఇది రంజన్ గోగోయ్ యొక్క నకిలీ ఖాతా అని ఆయన ఇటువంటి ట్వీట్ ఏది చేయలేదని తెలిపారు.

రంజన్ గోగోయ్ పేరున ట్విట్టర్ పై చాలా పారడి ఖాతాలు ఉన్నాయి మరియు ట్వీట్స్ యొక్క స్క్రీన్ షాట్స్ తరచూ ఫేస్‎బుక్ లేదా ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ పై వైరల్ అవుతూ ఉంటాయి. విశ్వాస్ న్యూస్ ఇదివరకు కూడా రంజన్ గోగోయ్ పేరున చేయబడిన నకిలీ ట్వీట్స్ గురించి వాస్తవ తనిఖీ నిర్వహించింది. వాస్తవ తనిఖీ కథనాలు ఇక్కడ చదవవచ్చు.

ఇప్పుడు వైరల్ నకిలీ స్క్రీన్ షాట్ షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ యొక్క సోషల్ స్కానింగ్ చేయాలి. ఫేస్‎బుక్ యూకర్ ఎస్ కే ఖుంట్వాల్ ఇండోర్, మధ్య ప్రదేశ్ నివాసి అని మాకు తెలిసింది. మరియు ఈ ప్రొఫైల్ నుండి ఇదివరకు కూడా కొన్ని నకిలీ పోస్ట్స్ షేర్ చేయబడ్డాయి.

निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ తన విచారణలో ఈ ట్వీట్ నకిలీది అని కనుగొనింది. రంజన్ గోగోయ్ ఇటువంటి ట్వీట్ ఏదీ చేయలేదు.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later