X
X

వాస్తవ తనిఖీ: రూ. 2000 నోట్లను మార్చుకొనుటకు ఎలాంటి ఐడి ప్రూఫ్ అవసరం లేదు, వైరల్ క్లెయిమ్ తపుదోవపట్టించేది

  • By: Abhishek Parashar
  • Published: May 31, 2023 at 12:00 PM
  • Updated: Jul 12, 2023 at 06:21 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‎బిఐ) రూ. 2000 నొట్లను చలామణి నుండి ఉపసంహరించిన తరువాత, నోట్లను మార్చుకొనుటకు ప్రజలు ఇప్పుడు ఒక ప్రత్యేక ఫార్మ్ ను నింపాలని మరియు తమ గుర్తింపు ప్రూఫ్ ను చూపించాలని సోషల్ మీడియా యూజర్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ వెంబడి, మార్పిడి కొరకు అవసరమైన ఒక స్లిప్ యొక్క కాపీ కూడా వైరల్ అవుతోంది.

ఈ వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది విశ్వాస్ న్యూస్ కనుగొనింది. రూ. 2,000 నోట్లను మార్చుకొనుటకు ప్రజలు ఎలాంటి గుర్తింపు కార్డు చూపించవలసిన అవసరం కాని, ఫార్మ్స్ నింపవలసిన పని కానిలేదని ఆదివారము నాడు ఆర్‎బిఐ స్పష్టీకరించింది. రూ. 2000 నోట్ల మార్పిడి కొరకు స్లిప్ ను తప్పనిసరి చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‎బిఐ) కూడా తక్షణ ప్రభావముతో ఈ ఆదేశాన్ని ఉపసంహరించుకుంది.

క్లెయిమ్:

వైరల్ పోస్ట్ (ఆర్కైవ్ లింక్) ను షేర్ చేస్తూ, సోషల్ మీడియా యూజర్ ‘ఎండి జకారియ ఖాన్’ ఇలా వ్రాశారు, “సోదర సోదరీమణులారా, పూరించవలసిన ఫార్మ్ వచ్చేసింది, దీనిని పూరించి బ్యాంకుల బయట క్యూలో నిలబడాలి.”

అనేకమంది ఇతర యూజర్లు కూడా ఇదే ఫార్మ్ ను ఇటువంటి క్లెయిమ్స్ తో షేర్ చేశారు. యూజర్లు ఈ క్లెయిమ్ ను ట్విట్టర్ పై కూడా షేర్ చేస్తున్నారు.

దర్యాప్తు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‎బిఐ)మే 19వ తేదీన రూ. 2,000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించింది. దీనితోపాటు, ఈ నోట్లు చలామణి నుండి ఉపసంహరించబడినప్పటీకీ, అవి చెలామణిలో ఉంటాయి అని ఆర్‎బిఐ స్పష్టం చేసింది.

‘క్లీన్ నోట్ పాలసీ’ కింద రూ 2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించాలని ఆర్‎బిఐ నిర్ణయించింది. ప్రకటన ప్రకారము, “ప్రజలు రూ. 2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయవచ్చు లేదా సాధారణ విధానములో ఏదైనా బ్యాంకు శాఖలో ఇతర నోట్ల కొరకు మార్చుకోవచ్చు. నోట్లను డిపాజిట్ చేసే ప్రక్రియ ఒక సాధారణ ప్రక్రియ అవుతుంది మరియు ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఈ మొత్తం ప్రక్రియ ప్రస్తుతం ఉన్న మరియు ఇతర చెల్లుబాటు అయ్యే శాసన సంబంధ నిబంధనల ప్రకారం ఉంటుంది.”

ఆర్‎బిఐ ప్రకటన ప్రకారము, “మే 23, 2023 నుండి అమలు అయ్యే విధంగా, బ్యాంకు కార్యకలాపాలు మృదువుగా జరుగుటకు మరియు కార్యకలాపాల సౌకర్యము కొరకు రూ. 2,000 నోట్లను ఒకసారికి రూ. 20,000 వరకు మార్చుకోవచ్చు.”నోట్లను మార్చుకొనుటకు ఈ సదుపాయము బ్యాంకులు మరియు ఆర్‎బిఐ యొక్క 19 ప్రాంతీయ కార్యకలాపాలలో అందుబాటులో ఉంటుంది.

వైరల్ పోస్ట్ లో చేయబడిన క్లెయిమ్ కు సంబంధించి విశ్వాస్ న్యూస్ ఆర్‎బిఐ ప్రతినిధిని సంప్రదించింది. రూ. 2000 నోట్లను మార్చుకొనుటకు ఒక ప్రత్యేక ఫార్మ్ నింపడము (మార్పిడి కొరకు స్లిప్) మరియు ఒక గుర్తింపు కార్డును అందించడము గురించి అడిగినప్పుడు, ఆయన ఇలా అన్నారు, “ఎలాంటి ఐడి ప్రూఫ్ లేదా గుర్తింపు కార్డును అందించవలసిన పనిలేదు. దీనిని సాధారణ విధానములో డిపాజిట్ చేయవచ్చు లేదా ఇతర నోట్లతో మార్చుకోవచ్చు.”

ఒక న్యూస్ సెర్చ్ లో, మాకు రూ. 2,000 నోట్ల మార్పిడి కొరకు ఎలాంటి ఫార్మ్ లేదా ఐడి కార్డు అవసరం లేదని ఎస్‎బిఐ చేసిన ప్రకటన కలిగిన అనేక రిపోర్ట్స్ లబించాయి. న్యూస్ ఏజెన్సీ ఏఎన్‎ఐ కూడా దీనిపై రిపోర్ట్ చేసింది.

రూ. 2000 నోట్లను ఉపసంహరించాలనే ఆర్‎బిఐ యొక్క నిర్ణయము తరువాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మే 19, 2023 నాడు జారీచేయబడిన ఈ-సర్క్యులర్ యొక్క అనుబంధం III లో రూ. 2,000 నోట్ల మార్పిడి కొరకు గుర్తింపు ప్రూఫ్ అవసరమని తెలిపింది.

‘ది హిందు’ లోని రిపోర్ట్  ప్రకారము, మే 21వ తేదీన ఎస్‎బిఐ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. బ్యాంక్ శాఖలకు జారీ చేయబడిన లేఖ ఇలా పేర్కొనింది, “మార్పిడి కొరకు ఎలాంటి గుర్తింపు కార్డు ఇవ్వవలసిన అవసరం లేదు… అందుచేత మే 19, 2023 నాటి ఈ-సర్క్యులర్ లో ఉన్న అనుబంధము తక్షణ అమలుతో ఉపసంహరించబడుతుంది. ఈ-సర్క్యులర్ లో ఉన్న ఇతర సూచనలలో ఎలాంటి మార్పు లేదు.”

ఆర్‎బిఐ వెబ్సైట్ పై, మాకు అన్ని బ్యాంకుల చైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్స్ మరియు చీఫ్ ఎక్సిక్యూటివ్ అధికారుల పేర ఉద్దేశించబడిన మే 22 తేదీ నాటి ప్రకటన లభించింది, ఇందులో ఈ విధంగా పేర్కొనబడింది, “మే 19, 2023 తేదీ నాటి సర్క్యులర్ ప్రకారము, రూ. 2000 నోట్లు సాధారణ విధానములోనే అన్ని కౌంటర్లలో డిపాజిట్ చేయబడతాయి. 2000 రూపాయల బ్యాంక్ నోట్ల మార్పిడి సదుపాయము ప్రజలకు గతములో మాదిరిగానే అందుబాటులో ఉంటుంది.”

దీని వెంబడి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంకు వెళ్ళేందుకు ప్రజలు హడావిడీ పడవద్దని, 2000 రూపాయల నోట్లు ఇంకా చెల్లుబాటు అవుతాయని ప్రజలకు తెలిపారు.

డీమానిటైజేషన్ తరువాత రూ. 2,000 నోట్లు జారీ చేయబడిన ఉద్దేశము నెరవేరిందని మరియు బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రస్తుతం ఇతర డినామినేషన్ నోట్లు తగినంతగా అందుబాటులో ఉన్నాయని శ్రీ దాస్ తెలిపారు. ఇదే సమయములో, రూ. 2,000 నోటు చెలామణి కూడా తగ్గింది మరియు ఇది 6.73 లక్షల కోట్ల నుండి 3.62 లక్షల కోట్లకు పడీపోయింది. అంతేకాకుండా, ఈ నోటు ముద్రణ కూడా నిలిపివేయబడింది.

తప్పు క్లెయిమ్ తో ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్  కు ఫేస్‎బుక్ పై 7,000 మంది ఫాలో అవుతున్నారు. రూ 2000 నోట్లతో సహా ఇతర బ్యాంక్ నోట్లకు సంబంధించి వైరల్ క్లెయిమ్స్ యొక్క దర్యాప్తుపై విశ్వాస్ న్యూస్ వాస్తవ-తనిఖీ రిపోర్ట్స్ ను ఇక్కడ చదవవచ్చు.

ముగింపు: రూ. 2,000 నోట్ల మార్పిడి కొరకు ఒక ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయడము మరియు ఒక ఫార్మ్ నింపడముపై క్లెయిమ్స్ అన్నీ తప్పు. చెలామణి నుండి ఉపసంహరించబడిన తరువాత రూ 2,000 నోట్ల మార్పిడి కొరకు ఏ ఫార్మ్ పూర్తి చేయవలసిన పనిలేదు లేదా గుర్తింప్ ప్రూఫ్ అందించవలసిన పనిలేదు.

  • Claim Review : రూ 2000 నోట్ల మార్పిడి కొరకు ప్రజలు ఒక ప్రత్యేక ఫార్మ్ నింపాలి మరియు తమ గుర్తింపు ప్రూఫ్ ను చూపించాలి
  • Claimed By : ఎఫ్‎బి యూజర్: ఎండి జకారియ ఖాన్
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next page

Post saved! You can read it later