X
X

వాస్తవ తనిఖీ: 2018లో మహారాష్ట్రలో సాగిన ఉద్యమానికి చెందిన ఫోటో పానిపట్‌ పేరుతో ఇప్పుడు వైరల్‌ అవుతోంది

పానిపట్ పేరిట వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీదని విశ్వాస్‌ న్యూస్ దర్యాప్తులో నిరూపించబడింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన రైతుల నిరసనకు సంబంధించిన ఫోటోను ఇప్పుడు పానిపట్‌లో జరిగిన ఉద్యమం సందర్భంగా తీసినదిగా కొందరు వైరల్‌ చేస్తున్నారు.

  • By: Ashish Maharishi
  • Published: Oct 2, 2020 at 11:30 AM
  • Updated: Oct 4, 2020 at 08:09 PM

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల పేరుతో పాత చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో, మహారాష్ట్రలో 2018లో తీసిన ఫోటోను ప్రస్తుతం పానిపట్ ఉద్యమంలో తీసినట్లుగా పేర్కొంటూ కొందరు వైరల్‌ చేస్తున్నారు.

విశ్వాస్‌ న్యూస్‌ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని నిరూపించబడింది. 2018 ఏప్రిల్‌లో మహారాష్ట్రలో రైతుల ఆందోళన సందర్భంగా తీసిన ఫోటోను ఇప్పుడు కొంతమంది పానిపట్‌లో జరిగినట్లు ప్రస్తావిస్తూ వైరల్ చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్నది ఏంటి?
ఫేస్‌బుక్ యూజర్ ముజీబ్ షేక్, సెప్టెంబర్ 24వ తేదీన ఒక ఫోటోను అప్‌లోడ్ చేశారు. దానికి ఇలా రైటప్‌ ఇచ్చారు : ‘పానిపట్‌లోని ఈ భారీ రైతుల ర్యాలీ చెబుతోంది, బిజెపికి అంతిమఘడియలు ఆసన్నమయ్యాయి. మేము ఏదో ఒక సమయంలో ఢిల్లీకి వెళ్తాం, ఏదో ఒకటి చేస్తాం. ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. అయినా మేం ఆగేది లేదు… ‘
వైరల్‌ అవుతున్న ఆ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ఇక్కడి చూడవచ్చు.

వైరల్‌ పోస్ట్‌ యొక్క అర్కైవ్‌ వెర్షన్‌ ఇక్కడ క్లిక్‌ చేసి చూడవచ్చు.

దర్యాప్తు :
విశ్వాస్‌ న్యూస్ మొదటగా ఈ వైరల్ ఫోటోను పరిశోధించింది. దీని కోసం, మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్‌లో ఫోటోను అప్‌లోడ్ చేసి శోధించాము. శోధన సమయంలో, Yourstory అనే వెబ్‌సైట్‌లో ఈ ఫోటోను మేము కనుగొన్నాము. ఇది 13 మార్చి 2018లో అప్‌లోడ్ చేశారు. ఈ వెబ్‌సైట్‌లో మేము కనుగొన్న అతి పురాతన చిత్రం ఇదే. రైతులు ముంబైకి పాదయాత్ర చేపట్టినట్లు ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు. ఆ నిరసన కార్యక్రమానికి వేలాది మంది రైతులు హాజరయ్యారు. మీరు దీనికి సంబంధించిన పూర్తి వార్తా కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.

దర్యాప్తులో… ఎన్‌డిటివి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో సంబంధిత ఉద్యమం గురించిన వార్తలు మాకు కనిపించాయి.

పానిపట్‌ ఉద్యమంగా పేర్కొంటున్న ఫోటోకు సంబంధించి మరో కోణం నుంచి తీసిన చిత్రం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో కనిపించింది. అవే పసుపు రంగు డివైడర్లు ఆ ఫోటోలో కూడా కనిపించాయి.

మరింత సమాచారం కోసం విశ్వాస్ న్యూస్.. సహోద్యోగి అయిన దైనిక్ జాగరణ్‌ పానిపట్ ఇంచార్జ్ రవి ధావన్‌ను సంప్రదించింది. ఈ వైరల్ ఫోటో పానిపట్‌కు సంబంధించినది కాదని ఆయన మాకు చెప్పారు. పానిపట్‌లో అలాంటి రోడ్లు లేవని, వైరల్ పోస్ట్ తప్పు అని నిర్ధారించారు.

చివరికి, మేము నకిలీ పోస్ట్‌ను షేర్‌ చేసిన ఫేస్‌బుక్‌ యూజర్‌ ముజీబ్ షేక్ అకౌంట్‌ను సోషల్‌ స్కానింగ్‌ చేయడం జరిగింది. దీంతో ఈ యూజర్ ఢిల్లీకి చెందిన వారని మాకు తెలిసింది. ఫేస్‌బుక్‌లో ఈ అకౌంట్‌ సెప్టెంబర్ 2015 న క్రియేట్‌ చేశారు.

निष्कर्ष: పానిపట్ పేరిట వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీదని విశ్వాస్‌ న్యూస్ దర్యాప్తులో నిరూపించబడింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన రైతుల నిరసనకు సంబంధించిన ఫోటోను ఇప్పుడు పానిపట్‌లో జరిగిన ఉద్యమం సందర్భంగా తీసినదిగా కొందరు వైరల్‌ చేస్తున్నారు.

  • Claim Review : ఈ ఫోటో పానిపట్‌ ఆందోళనలో తీసినదని పేర్కొనబడింది.
  • Claimed By : ఫేస్‌బుక్ యూజర్ ముజీబ్ షేక్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later