X
X

వాస్తవ తనిఖీ: తమిళనాడులో బీహార్ వలసదారులపై దాడిపై జాగరణ్ రిపోర్ట్ యొక్క స్క్రీన్ షాట్ సృష్టించబడినది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): మార్చ్ 2 నాడు, తమిళనాడులో పనిచేసే బీహార్ కూలీలపై దాడి గురించి వార్తాపత్రికల ద్వారా తనకు సమాచారము అందింది అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్వీట్ చేశారు. రిపోర్ట్స్ ను అనుసరించి, రాష్ట్రము యొక్క వలస కూలీల భద్రతను నిర్ధారించాలని ఆయన బీహార్ ప్రధాన కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు సూచించారు. ఇటీవల, హిందీ మాట్లాడే వలస కూలీలపై దాడికి సంబంధించి ఒక వీడియో బయటికి వచ్చింది. దక్షిణ భారతదేశములోని ఒక రైలులో జరిగిన ఒక సంఘటన నుండి తీయబడిన ఈ వీడియో ఆధారంగా, పోలీసులు ఆ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా, దైనిక్ జాగరణ్ ద్వారా ప్రచురించబడినదిగా క్లెయిమ్ చేయబడుతున్న ఒక వార్త యొక్క స్క్రీన్ షాట్ వివిధ సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతోంది. హిందీ మాట్లాడే వారు మార్చ్ 20 నాటికి రాష్ట్రము వదిలి పోవాలి అని లేదా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి బెదిరించారని ఈ రిపోర్ట్ క్లెయిమ్ చేసింది. రిపోర్ట్ ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ మరియు ఒడిశాకు చెందిన వలదారులైన పౌరులు, గడువుతేదీ తరువాత తమిళనాడులో ఉంటే, ప్రాణాలు పోగొట్టుకుంటారని స్టాలిన్ చెప్పారు. ఇదే వైరల్ స్క్రీన్ షాట్ లో హిందీ-మాట్లాడే కూలీలు అందరు తమ తమ రాష్ట్రాలకు తిరిగి వచ్చేయమని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభ్యర్ధించారని క్లెయిమ్ చేసే ప్రకటన కూడా ఉంది.

దైనిక్ జాగరణ్ వార్తాపత్రిక పేరును దుర్వినియోగం చేస్తూ తప్పు వార్త వ్యాప్తింప జేయబడిందని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ జాగరణ్ లో ప్రచురించబడిన వార్తకు సంబంధించినది కాదు, కాని జాగరణ్ యొక్క లోగో ఉపయోగించి తయారు చేయబడింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లకు ఆపాదించబడిన వైరల్ అయిన స్క్రీన్ షాట్స్ లో కనిపించే ప్రకటనలు తయారుచేయబడినవి మరియు నకిలీవి.

క్లెయిమ్:

హిందీ-మాట్లాడే వలసదారులైన కూలీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు అనే క్లెయిమ్ తో ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది. దైనిక్ జాగరణ్ వార్తాపత్రికలో ప్రచురించబడిన ఒక వార్తా రిపోర్ట్ గా ఆరోపించబడిన ఈ క్లెయిమ్ ఆపాదించబడింది. స్టాలిన్ ఆదేశము తరువాత, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందీ మాట్లాడే కూలీలు తమిళనాడు వదిలి వచ్చేయాలని అభ్యర్ధించారని ఈ రిపోర్ట్ తెలిపింది.

దర్యాప్తు:

వైరల్ స్క్రీన్ షాట్ లో దైనిక్ జాగరణ్ యొక్క లోగో ఉంది, ఈ కారణంగా ఈ వార్త జాగరణ్ లో ప్రచురించబడినదిగా కనిపిస్తుంది. ఈ స్క్రీన్ షాట్ ఎడిటింగ్ సాధనాలు ఉపయోగించి తయారు చేశారు అని మరియు ఇటువంటి వార్త ఏదీ దైనిక్ జాగరణ్ యొక్క ఏ సంచికలో ప్రచురించబడలేదు అని మా దర్యాప్తులో మేము కనుగొన్నాము.

వార్తలలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఆపాదించబడిన ప్రకటన కూడా కల్పించబడినది మరియు అసంబద్ధమైనది. విశ్వాస్ న్యూస్ అదనపు ధృవీకరణ కొరకు దైనిక్ జాగరణ్ యొక్క ఉత్తర్ ప్రదేశ్ సంపాదకుడు అశుతోష్ శుక్లాగారిని సంప్రదించింది. దైనిక్ జాగరణ్ లోగో దుర్వినియోగం చేసి నకిలీ వార్తలను వ్యాపింపజేయటానికి ప్రయత్నాలు చేయబడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. జాగరణ్ లో ఇలాంటి వార్తలు ఏవీ ప్రచురించబడలేదు.

వార్తా సెర్చ్ లలో కూడా, తమిళనాడు నుండి హిందీ మాట్లాడే కూలీలు తిరిగి వచ్చేయాలని యోగి ఆదిత్యనాథ్ చేసిన అభ్యర్ధనకు సంబంధించిన రిపోర్ట్ మాకు ఏదీ కనిపించలేదు.

విశ్వాస్ న్యూస్ వైరల్ మెసేజ్ కు సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క మీడియా సలహాదారు మృత్యుంజయ్ సింగ్ ను సంప్రదించింది. “ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు” అని ఆయన అన్నారు.

రిపోర్ట్ ప్రకారము, తమిళనాడులో బీహార్ కూలీలపై దాడికి సంబంధించి శుక్రవారము బీహార్ శాసన సభలో భారీ కోలాహలం జరిగింది. 12 మంది కూలీలు మరణించారని క్లెయిమ్ చేస్తూ ప్రతిపక్ష నేత విజయ్ సిన్హా అక్కడికి ఒక బృందాన్ని పంపించాలని కోరారు.

బీహార్ శాసనసభలో జరిగిన గందరగోళం తరువాత, తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ క్లెయిమ్స్ ను ఖండిస్తూ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. బీహార్ నుండి వలస వచ్చిన కూలీలపై దాడికి సంబంధించిన క్లెయిమ్ అసత్యమని మరియు తప్పు వీడియోలను షేర్ చేస్తూ కొంతమంది దుర్మార్గులు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొంటూ తమిళనాడు పోలీస్ తన అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్ నుండి ఫిబ్రవరి 2 నాడు ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది.

తన ప్రకటనలో తమిళనాడు డిజిపి, తమిళనాడులో హిందీ-మాట్లాడే వలస కూలీలపై దాడులకు సంబంధించిన క్లెయిమ్స్ చేయబడిన వీడియోల గురించి కూడా ప్రస్తావించారు. వీడియోలు రెండు అసత్యమే అని వివరిస్తూ, రెండు సందర్భాలలో ఘర్షణ తమిళనాడు ప్రజలు మరియు వలస కూలీల మధ్య కాదని ఆయన తెలిపారు.

విశ్వాస్ న్యూస్ తమిళనాడు డిజిపి కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ విషయమై డిజిపి ఇదివరకే ఒక ప్రకటన విడుదల చేశారని మరియు “రాష్ట్రములో హిందీ మాట్లాడే వలస కూలీలు సురక్షితంగా ఉన్నారు” అని మాకు తెలియజేయబడింది. మేము ఈ అంశాన్ని గురించి బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను కూడా సంప్రదించాము. వాళ్లు స్పందించిన తరువాత, ఈ కథనం అప్డేట్ చేయబడుతుంది.

ముగింపు: తమిళనాడులో హిందీ మాట్లాడే కూలీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలని దైనిక్ జాగరణ్ లోగోతో వైరల్ అయిన వార్త నకిలీది. ఇది ఎడిటింగ్ సాధనాలు ఉపయోగించి సృష్టించబడింది. ఇటువంటి వార్త జాగరణ్ లో ప్రచురించబడలేదు, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి హిందీ మాట్లాడే వలస కూలీలను రాష్ట్రము వదిలి వెళ్ళిపోవాలని చెప్పలేదు. ఇదే సమయములో, యోగి ఆదిత్యనాథ్ కూడా హిందీ మాట్లాడే వలస కూలీలు వీలైనంత తొందరగా తిరిగి తమ తమ రాష్ట్రాలకు వచ్చేయాలని కోరలేదు. ఆయన పేరున వైరల్ అవుతున్న ఈ ప్రకటన కల్పించబడింది మరియు అసంబద్ధమైనది.

  • Claim Review : హిందీ మాట్లాడే వారు రాష్ట్రము వదిలి పోవాలి అని లేదా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి బెదిరించారని దైనిక్ జాగరణ్ రిపోర్ట్ క్లెయిమ్ చేసింది.
  • Claimed By : ఎఫ్‎బి యూజర్: నేహా రాజపూత్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later